నడుం నొప్పి వేధిస్తే ఇలా చేయండి..
- November 20, 2017
గంటల పాటు కంప్యూటర్ల ముందు కూర్చుంటున్నారా? నడుం నొప్పి వేధిస్తుందా? అయితే గోరువెచ్చటి నూనెతో నడుమూ, వెన్ను ప్రాంతాల్లో నెమ్మదిగా మర్దనా చేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల నొప్పితోపాటూ ఒత్తిడి కూడా తగ్గుతుంది.
నొప్పి తగ్గేవరకు ప్రతిరోజూ కొన్ని వారాలపాటు చేయాలి. సరైన పద్ధతిలో పడుకోకపోవడం వల్ల కూడా వెన్నునొప్పి బాధిస్తుంది. ఒకవేళ మీరు వెల్లకిలా పడుకోవాలనుకుంటే మీ మోకాళ్ల కింద తలగడను తప్పకుండా పెట్టుకోవాలి. ఒకవైపు తిరిగి పడుకోవాలనుకుంటే రెండు మోకాళ్లను మడిచి వాటి మధ్యలో తలగడను పెట్టుకోవాలి.
వేడి నీటిలో వస్త్రాన్ని ముంచి కాపడం పెట్టుకోవడం వల్ల నడుం నొప్పి చాలామటుకూ అదుపులోకి వస్తుంది. కొన్ని ఐసు ముక్కలను లేదా చల్లటి కూరగాయల ప్యాకెట్ను ఒక తువాలులో చుట్టి దాంతో నడుంపై నెమ్మదిగా 15-20 సార్లు రుద్దినట్టు చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. చిన్నచిన్న వ్యాయామాలు కూడా నడుము నొప్పిని చాలామటుకూ అదుపులోకి తెస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









