నడుం నొప్పి వేధిస్తే ఇలా చేయండి..
- November 20, 2017
గంటల పాటు కంప్యూటర్ల ముందు కూర్చుంటున్నారా? నడుం నొప్పి వేధిస్తుందా? అయితే గోరువెచ్చటి నూనెతో నడుమూ, వెన్ను ప్రాంతాల్లో నెమ్మదిగా మర్దనా చేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల నొప్పితోపాటూ ఒత్తిడి కూడా తగ్గుతుంది.
నొప్పి తగ్గేవరకు ప్రతిరోజూ కొన్ని వారాలపాటు చేయాలి. సరైన పద్ధతిలో పడుకోకపోవడం వల్ల కూడా వెన్నునొప్పి బాధిస్తుంది. ఒకవేళ మీరు వెల్లకిలా పడుకోవాలనుకుంటే మీ మోకాళ్ల కింద తలగడను తప్పకుండా పెట్టుకోవాలి. ఒకవైపు తిరిగి పడుకోవాలనుకుంటే రెండు మోకాళ్లను మడిచి వాటి మధ్యలో తలగడను పెట్టుకోవాలి.
వేడి నీటిలో వస్త్రాన్ని ముంచి కాపడం పెట్టుకోవడం వల్ల నడుం నొప్పి చాలామటుకూ అదుపులోకి వస్తుంది. కొన్ని ఐసు ముక్కలను లేదా చల్లటి కూరగాయల ప్యాకెట్ను ఒక తువాలులో చుట్టి దాంతో నడుంపై నెమ్మదిగా 15-20 సార్లు రుద్దినట్టు చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. చిన్నచిన్న వ్యాయామాలు కూడా నడుము నొప్పిని చాలామటుకూ అదుపులోకి తెస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









