విజయవంతమైన జీశాట్-15
- November 12, 2015
బారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 3.04 గంటలకు జీశాట్-15 ఉపగ్రహాన్ని ఫ్రెంచి గయానాలోని కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా ప్రయోగించింది. ఈ అంతరిక్ష కేంద్రం రూపొందించిన అరైన్5వీఏ227 రాకెట్ ద్వారా 3,164 కిలోల బరువైన జీశాట్-15 ఉపగ్రహంతో పాటు అరబ్శాట్-6బీను రోదసీలోకి పంపారు. 43.24 నిమిషాల్లో ప్రయోగాన్ని పూర్తిచేశారు. ఈ ఉపగ్రహాన్ని 250 కిలోమీటర్ల పెరిజీ (భూమికి దగ్గరగా), 35,819 కిలోమీటర్ల అపోజీ (భూమికి దూరంగా) భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఇది నిర్ణీత కక్ష్యలోకి చేరగానే బెంగళూరులోని హసన్లో ఉన్న మాస్టర్ కంట్రోల్ తమ అధీనంలోకి తీసుకున్నారు. జీశాట్-15 ఉపగ్రహంలో 24 కేయూ బ్యాండ్ ట్రాన్స్పాండర్లు, రెండు గగన్(జీపీఎస్ ఎయిడెడ్. జియో ఆగ్యుమెంట్ నావిగేషన్) పేలోడ్లు అమర్చారు. ఇన్శాట్-3ఏ, ఇన్శాట్-4బీ ఉపగ్రహాల కాలపరిమితి ముగియడంతో సుమారు రూ.800 కోట్ల వ్యయంతో తయారుచేసిన జీశాట్-15ను ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహం ద్వారా మెరుగైన టెలివిజన్ ప్రసారాలు, విమానాల సిగ్నల్స్ అందుతాయి.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!







