8 ఏళ్ళ చిన్నారిపై హత్యాచారం: దోషికి మరణశిక్ష అమలు

- November 23, 2017 , by Maagulf
8 ఏళ్ళ చిన్నారిపై హత్యాచారం: దోషికి మరణశిక్ష అమలు

దుబాయ్‌: 8 ఏళ్ళ చిన్నారిపై కిరాతకంగా లైంగిక దాడికి పాల్పడి, ఆనక ఆ చిన్నారిని హతమార్చిన ఘటనలో 49 ఏళ్ళ వ్యక్తికి మరణశిక్షను అమలు చేశారు. గురువారం ఉదయం ఈ శిక్షను అమలు చేసినట్లు అధికారులు తెలిపారు. నిదాల్‌ ఎస్సా అబ్దుల్లా అనే వ్యక్తి, 8 ఏళ్ళ ఒబైదా చిన్నారిపై లైంగిక దాడి చేశాడు. ఈ ఘటనలో నిందితుడిపై నేరారోపణలు రుజువయ్యాయి. 2016 మే 20న చిన్నారి అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు అందింది. రెండ్రోజుల తర్వాత చిన్నారి మృతదేహం అల్‌ వర్కా ఏరియాలో లభ్యమయ్యింది. నిదాల్‌ ఎస్సాపై కిడ్నాప్‌ కేసు తొలుత నమోదయ్యింది. ఆ తర్వాత లైంగిక దాడి, హత్యారోపణలూ నమోదు చేశారు. దోషిగా తేలినా, నిదాల్‌ ఎస్సాపై మరణ శిక్ష మాత్రం వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా దుబాయ్‌ కోర్ట్‌ ఆఫ్‌ కాస్సేషన్‌ తీర్పు, దుబాయ్‌ రూలర్‌ అనుమతితో మరణ శిక్ష విధించడం జరిగింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com