తెలుగు రాష్ట్రాలకు త్వరలో ఉక్కు శుభవార్త
- November 23, 2017
న్యూఢిల్లీ: ఉక్కు పరిశ్రమలకు సంబంధించి తెలుగు రాష్ట్రాలు త్వరలో శుభవార్త వింటాయని కేంద్రమంత్రి బీరేంద్రసింగ్ అన్నారు. ఈరోజు దిల్లీలో కేంద్రమంత్రి బీరేంద్రసింగ్తో కేంద్రమంత్రి సుజనాచౌదరి, ఏపీ మంత్రి సుజయకృష్ణ రంగారావు, తెలంగాణ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. విభజన చట్టంలో హామీ మేరకు కడప, బయ్యారంలో ఉక్కు కర్మాగారాల ఏర్పాటుపై చర్చించారు. సుమారు 2 గంటల పాటు సాగిన సమావేశంలో విభజన చట్టం హామీలు నిలబెట్టుకోవాలని బీరేంద్రసింగ్ను కోరారు.
ఈ సందర్భంగా బీరేంద్రసింగ్ మాట్లాడుతూ.. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కేంద్రం చిత్తశుద్ధితో ఉందన్నారు. టాస్క్ఫోర్స్ కమిటీ నెలరోజుల్లో నివేదిక ఇస్తుందన్నారు. స్వల్పకాలికంగా, దీర్ఘకాలికంగా ఏ తరహా చర్యలు తీసుకోవాలన్న దానిపై చర్చ జరిగినట్లు తెలిపారు. నెల రోజుల తర్వాత మరోసారి సమావేశం నిర్వహిస్తామన్నారు. ఉక్కు నాణ్యత అధ్యయనానికి టాస్క్ఫోర్స్ కమిటీకి సమయం పడుతుందని పేర్కొన్నారు.
'కడపలో ఉక్కు కర్మాగారం వచ్చి తీరుతుంది. దీని ద్వారా కడప వాసులకు ఉద్యోగాలు వస్తాయి. కడప ఉక్కు కర్మాగారానికి, విశాఖలో ఏర్పాటయ్యే కర్మాగారానికి సంబంధం లేదు` అని కేంద్రమంత్రి సుజనాచౌదరి స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







