మంత్రి లోకేష్ సమక్షంలో టీడీపీ లో చేరిన రాజు

- November 23, 2017 , by Maagulf
మంత్రి లోకేష్ సమక్షంలో టీడీపీ లో చేరిన రాజు

శ్రీకాకుళం: జిల్లాలోని శ్రీకూర్మం ఎంపీటీసీ సభ్యుడు కైబాడి రాజు బుధవారం అమరావతిలో మంత్రి లోకేష్, ఎమ్మెల్యే లక్ష్మిదేవి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. చంద్రబాబు రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితుడై పార్టీలో రాజు చేరినట్లు చెప్పారు. రాజుతోపాటు అంపోలు ఏపీసీఎస్ ఉపాధ్యక్షుడు రెల్ల నర్సింహులు, రైతు సంఘం నాయకుడు గొలివి భాస్కరరావు కూడా టీడీపీలో చేరారు. కార్యక్రమంలో అరసవెల్లి డిస్టిబ్యూటరీ కమిటీ చైర్మన్ వీఎస్ గిరి. పీహెచ్‌సీ అభివృద్ధి కమిటీ చైర్మన్ మైగాపు ప్రభాకరరావు, జిల్లా టీడీపీ ఎస్సీ విభాగం ప్రధాన కార్యదర్శి గోర సురేష్, ఎంపీటీసీ సభ్యులు కోరాడ వెంటరావు, డి. మాధవేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com