మంత్రి లోకేష్ సమక్షంలో టీడీపీ లో చేరిన రాజు
- November 23, 2017
శ్రీకాకుళం: జిల్లాలోని శ్రీకూర్మం ఎంపీటీసీ సభ్యుడు కైబాడి రాజు బుధవారం అమరావతిలో మంత్రి లోకేష్, ఎమ్మెల్యే లక్ష్మిదేవి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. చంద్రబాబు రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితుడై పార్టీలో రాజు చేరినట్లు చెప్పారు. రాజుతోపాటు అంపోలు ఏపీసీఎస్ ఉపాధ్యక్షుడు రెల్ల నర్సింహులు, రైతు సంఘం నాయకుడు గొలివి భాస్కరరావు కూడా టీడీపీలో చేరారు. కార్యక్రమంలో అరసవెల్లి డిస్టిబ్యూటరీ కమిటీ చైర్మన్ వీఎస్ గిరి. పీహెచ్సీ అభివృద్ధి కమిటీ చైర్మన్ మైగాపు ప్రభాకరరావు, జిల్లా టీడీపీ ఎస్సీ విభాగం ప్రధాన కార్యదర్శి గోర సురేష్, ఎంపీటీసీ సభ్యులు కోరాడ వెంటరావు, డి. మాధవేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!







