ఇండియాలో మళ్ళీ ఐటీ గండం
- November 24, 2017
ఇప్పటికే వరుస ఎదురుదెబ్బలతో చిత్తడైపోతున్న ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ నెత్తిన మరో 'తాటికాయ' పడింది. ఏకంగా పదివేల కోట్ల మేర సర్వీస్ ట్యాక్స్ భారం ఒక్కసారిగా మొయ్యాల్సి వస్తోంది. గత ఐదేళ్ళలో విదేశాలకు సాఫ్ట్ వేర్ ఎక్స్ పోర్ట్ చేసి.. తద్వారా పొందిన ప్రయోజనాల రిటర్న్స్ దాఖలు చేయాల్సిందిగా ఇండియాలోని ఐటీ కంపెనీలకు నోటీసులందాయి. ఆలస్యం చేసినందుకు జరిమానాతో కలిపి మొత్తం 15 శాతం సర్వీస్ టాక్స్ కట్టాల్సిన బాధ్యతను గుర్తు చేస్తున్నాయి ఆ నోటీసులు. విదేశాలకు ఐటీ సర్వీసులు అందించడమంటే.. ఇక్కడ అందుబాటులో వున్న వస్తువుల్ని విదేశీ కస్టమర్లకు అమ్ముకున్నట్లేనని.. ప్రత్యక్ష పన్నుల శాఖ చెబుతోంది. తాజా నోటీసులతో ఇండియాలోని 200 ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు నష్టపోనున్నాయి. దీని ప్రభావం రిక్రూట్ మెంట్ మీద పడే ప్రమాదం ఉందని నిరుద్యోగ వర్గాల్లో గుబులు మొదలైంది.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు









