ఇండియాలో మళ్ళీ ఐటీ గండం
- November 24, 2017
ఇప్పటికే వరుస ఎదురుదెబ్బలతో చిత్తడైపోతున్న ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ నెత్తిన మరో 'తాటికాయ' పడింది. ఏకంగా పదివేల కోట్ల మేర సర్వీస్ ట్యాక్స్ భారం ఒక్కసారిగా మొయ్యాల్సి వస్తోంది. గత ఐదేళ్ళలో విదేశాలకు సాఫ్ట్ వేర్ ఎక్స్ పోర్ట్ చేసి.. తద్వారా పొందిన ప్రయోజనాల రిటర్న్స్ దాఖలు చేయాల్సిందిగా ఇండియాలోని ఐటీ కంపెనీలకు నోటీసులందాయి. ఆలస్యం చేసినందుకు జరిమానాతో కలిపి మొత్తం 15 శాతం సర్వీస్ టాక్స్ కట్టాల్సిన బాధ్యతను గుర్తు చేస్తున్నాయి ఆ నోటీసులు. విదేశాలకు ఐటీ సర్వీసులు అందించడమంటే.. ఇక్కడ అందుబాటులో వున్న వస్తువుల్ని విదేశీ కస్టమర్లకు అమ్ముకున్నట్లేనని.. ప్రత్యక్ష పన్నుల శాఖ చెబుతోంది. తాజా నోటీసులతో ఇండియాలోని 200 ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు నష్టపోనున్నాయి. దీని ప్రభావం రిక్రూట్ మెంట్ మీద పడే ప్రమాదం ఉందని నిరుద్యోగ వర్గాల్లో గుబులు మొదలైంది.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







