29 ఉదయం నుంచి మెట్రో సర్వీసులు : మంత్రి కేటీఆర్

- November 25, 2017 , by Maagulf
29 ఉదయం నుంచి మెట్రో సర్వీసులు : మంత్రి కేటీఆర్

హైదరాబాద్: నగరంలో మెట్రో రైలు ప్రారంభానికి సిద్ధమైంది. 28వ తేదీ మధ్యాహ్నం 2-15 గంటలకు ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి మెట్రో రైలు ప్రారంభిస్తారు. మెట్రో ప్రారంభమయ్యే ప్రాంతాలను మంత్రి కేటీఆర్ శుక్రవారం పరిశీలించారు. ప్రజా ప్రతినిధులతో కలిసి నాగోల్ నుంచి ట్రయల్ రన్ చేశారు. ఇవాళ రాత్రి మెట్రో చార్జీలను మంత్రి ప్రకటిస్తారు. 29వ తేదీ ఉదయం 6 గంటల నుంచి మెట్రో సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. ప్రతి రోజు రాత్రి 10 గంటల వరకు ప్రయాణిస్తాయి. ప్రస్తుతానికి 57 మెట్రో రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో రైలుకు 3 బోగీలు ఉంటాయి. ఒక్కో బోగీలో 330 మంది ప్రయాణించవచ్చు. అవసరమైతే ఈ బోగీల సంఖ్యను పెంచుతామని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com