29 ఉదయం నుంచి మెట్రో సర్వీసులు : మంత్రి కేటీఆర్
- November 25, 2017
హైదరాబాద్: నగరంలో మెట్రో రైలు ప్రారంభానికి సిద్ధమైంది. 28వ తేదీ మధ్యాహ్నం 2-15 గంటలకు ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి మెట్రో రైలు ప్రారంభిస్తారు. మెట్రో ప్రారంభమయ్యే ప్రాంతాలను మంత్రి కేటీఆర్ శుక్రవారం పరిశీలించారు. ప్రజా ప్రతినిధులతో కలిసి నాగోల్ నుంచి ట్రయల్ రన్ చేశారు. ఇవాళ రాత్రి మెట్రో చార్జీలను మంత్రి ప్రకటిస్తారు. 29వ తేదీ ఉదయం 6 గంటల నుంచి మెట్రో సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. ప్రతి రోజు రాత్రి 10 గంటల వరకు ప్రయాణిస్తాయి. ప్రస్తుతానికి 57 మెట్రో రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో రైలుకు 3 బోగీలు ఉంటాయి. ఒక్కో బోగీలో 330 మంది ప్రయాణించవచ్చు. అవసరమైతే ఈ బోగీల సంఖ్యను పెంచుతామని అన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









