దుబాయ్ ప్రయాణమవ్వనున్న బాలకృష్ణ-నయన్ జోడీ

- November 26, 2017 , by Maagulf
దుబాయ్ ప్రయాణమవ్వనున్న బాలకృష్ణ-నయన్ జోడీ

నందమూరి నటసింహం బాలకృష్ణ చేస్తున్న కొత్త సినిమా కోసం బాలయ్యతో పాటుగా నయనతార దుబాయ్ వెళ్లనుందట. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య 102వ సినిమాగా తెరకెక్కుతున్న చిత్రం 'జై సింహా'. చిత్రంలో బాలకృష్ణ సరసన నయనతార, నటాషా హీరోయిన్లుగా నటిస్తున్నారు. సికే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి షెడ్యూల్ మాత్రమే పెండింగ్‌లో ఉంది.
అయితే ఈ షెడ్యూల్‌ను దుబాయ్‌లో ప్లాన్ చేసింది చిత్రయూనిట్. డిసెంబర్ 7వ తేదీ నుండి 17వ తేదీ వరకు దుబాయ్‌లో ఈ షెడ్యూల్ జరగనుంది. అక్కడ బాలకృష్ణ-నయనతార లపై ఓ పాటను, బాలకృష్ణ- నటాషా లపై మరో పాటను చిత్రీకరించనున్నారు. ఈ రెండు పాటల షూటింగ్ పూర్తయితే షూటింగ్ అంతా పూర్తయినట్లే. భారీ అంచనాల నడుమ ఈ సినిమా జనవరి 12న విడుదలకానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com