రాజీనామా చేసిన పాకిస్ధాన్‌ మంత్రి...నిరసనను నిలిపివేసిన ఆందోళనకారులు

- November 27, 2017 , by Maagulf
రాజీనామా చేసిన పాకిస్ధాన్‌ మంత్రి...నిరసనను నిలిపివేసిన ఆందోళనకారులు

ఇస్లామాబాద్: పాకిస్థాన్ న్యాయశాఖ మంత్రి జాహిద్ హమిద్ ఇవాళ రాజీనామా చేశారు. దీంతో ఇస్లామిక్ ఆందోళనకారులు తమ నిరసనను నిలిపేశారు. హైవే రోడ్లను స్తంభింపచేస్తూ గత కొన్ని రోజులుగా ఇస్లామిక్ అతివాదులు ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే. దైవ దూషణకు పాల్పడిన మంత్రి హమిద్‌ను వెంటనే తప్పించాలని ఇస్లామిక్‌వాదులు ఆందోళన నిర్వహించారు. రాజధాని ఇస్లామాబాద్‌కు కనక్ట్ చేసే రహదారులన్నీ మూసివేశారు. అయితే శనివారం జరిగిన హింసలో సుమారు ఆరు మంది మృతిచెందారు. 200 మంది గాయపడ్డారు. లాహోర్, పెషావర్, కరాచీల్లో భారీ స్థాయిలో ఆందోళనలు జరిగాయి. శనివారం జరిగిన హింసను కవర్ చేయకుండా ఉండేందుకు కొన్ని ప్రైవేటు ఛానళ్లను, సోషల్ మీడియాను ప్రభుత్వం రద్దు చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com