కేంద్రం: పలు పథకాలపై ఆధార్ లింకేజ్ గడువు పెంపు
- November 27, 2017
న్యూఢిల్లీ: బ్యాంక్ ఖాతాదారులు, మొబైల్ సబ్స్క్రైబర్లకు తమ ఖాతాలతో ఆధార్ అనుసంధానానికి సంబంధించి ఊరట లభించనుంది. రాజ్యాంగ ధర్మాసనం ఎదుట కేంద్రం, ఢిల్లీ సర్కార్ల వివాదానికి సంబంధించిన విచారణ ముగిసిన తర్వాత వివిధ సంక్షేమ పథకాలకు ఆధార్ అనివార్యతపై విచారణ చేపడతామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. మరోవైపు పలు పథకాలపై ఆధార్ లింకేజ్ గడువును వచ్చే ఏడాది మార్చి 31వరకూ పొడిగించేందుకు సిద్ధమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాకు కేంద్రం నివేదించింది.
రాజ్యాంగ ధర్మాసనం మాత్రమే ఈ అంశంపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తుందని జస్టిస్ మిశ్రా, జస్టిస్ ఏఎం కన్విల్కార్, జస్టిస్ డీవై చంద్రచూడ్లతో కూడిన సుప్రీం బెంచ్ పేర్కొంది. ఇప్పటివరకూ కస్టమర్లు తమ బ్యాంక్ ఖాతాలకు డిసెంబర్ 31లోగా ఆధార్ను లింక్ చేయాల్సి ఉండగా, మొబైల్ నెంబర్లకు ఫిబ్రవరి 6లోగా ఆధార్ లింకేజ్ను పూర్తిచేయాల్సి ఉంది. తాజాగా మార్చి 31వరకూ వీటి డెడ్లైన్ను సుప్రీం అనుమతితో కేంద్రం పొడిగించే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







