మళ్ళీ తెరపైకి స్వామీజీ, నటి రాసలీలలు.. 10 మంది వేధింపులకు గురి చేసి జీవితం నాశనం చేశారంటున్న నటి
- November 28, 2017
ఇటీవల బెంగళూరు శివారులోని యలహంక సమీపంలో హూణసమారణహళ్లి మద్దవేణపుర జంగమ మఠం కు చెందిన దయానంద స్వామీజీ సాండల్ వుడ్ నటి తో జరిపిన రాసలీలల వీడియో ఒకటి బయటకు వచ్చి హల్ చల్ చేసిన సంగతి విధితమే.. కాగా మళ్ళీ ఈ స్వామీజీ రాసలీల వ్యవహారం తెరపైకి వచ్చింది. ... రాసలీలల్లో ఉన్న నటి.. మంగళవారం (నవంబర్ 28వ తేదీన) ఓ వీడియోను మీడియాకు విడుదల చేసింది. తనను 10 మంది వేధింపులకు గురి చేసి బలిపశువును చేశారు.. నా జీవితం నాశనం చేసిన వారిని వదిలి పెట్టను.. అయితే తనకు ప్రాణహాని ఉంది.. కనుకనే మీడియా ముందుకు రాలేక పోతున్నా.. అందుకనే ఈ వీడియోను విడుదల చేస్తున్నట్లు ఆ నటి చెప్పింది. ప్రస్తుతం తనకు ఆరోగ్యం బాగోలేదు.. పైగా చంపేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులు.. దీంతో తాను అజ్ఞాతంలో ఉన్నట్లు మీడియాకు రిలీజ్ చేసిన వీడియో లో ఉంది. మూడు నాలుగు రోజుల్లో బెంగళూరు వస్తానని సదరు నటి చెప్పింది. నన్ను వేధింపులకు గురి చేసినవారే.. ఆ వీడియో తీసి నా జీవితం నాశనం చేశారు.. నా పరిస్థితి ఏ అమ్మాయికి రాకూడదు.. నన్ను ఇటువంటి స్థితికి తీసుకొచ్చిన వారిపై కేసు పెడతాను.. నేను ఆత్మహత్య యత్నం చేసిన సమయంలో కుటుంబ సభ్యులు అండగా నిలిచి.. చట్టపరంగా న్యాయ పోరాటం చేయమని చెప్పారు.. తాను బెంగళూరు వచ్చాక మీడియా సమావేశంలో అన్ని విషయాలను వెల్లడిస్తాను అని ఆ నటి చెప్పింది. దయానంద స్వామీజీ, సాండల్ వుడ్ నటి రాసలీలల వీడియో మీడియాలో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో మఠం భక్తులు ఆందోళన చేయడంతో స్వామీజీని మఠం నుంచి శాశ్వతంగా బహిష్కరించారు. వీడియో ను తమ వద్ద ఉంచుకున్న కొంతమంది.. రూ.5 కోట్లకు డిమాండ్ చేయగా.. తాను రూ. 50 లక్షలు ఇచ్చినట్లు... అయినా సీడీ ని కావాలనే రిలీజ్ చేసి తనను ఈ స్టేజ్ కు తీసుకొచ్చారని ఇటీవల దయానంద స్వామీజీ ఆరోపించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







