కాస్మొడ్రోమ్ నుండి రష్యా రాకెట్ పయ్రోగం...
- November 28, 2017
వొస్తొచెనీ:ఇక్కడ నిర్మించిన కొత్త కాస్మొడ్రోమ్ (రోదసీ నౌకలను ప్రయోగించే ప్రాంతం) నుండి రష్యా రెండో రాకెట్ను మంగళవారం ప్రయోగించింది. గతేడాదే దీన్ని ప్రారంభించారు. కజకస్తాన్లోని బైకనూర్పై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలని రష్యా భావిస్తున్న నేపథ్యంలో ఈ ప్రయోగం చోటు చేసుకుంది. వాతావరణ ఉపగ్రహాన్ని, ఇతర పరికరాలను తీసుకుని సోయుజ్ రాకెట్ మంగళవారం మధ్యాహ్నం 2.41గంటలకు రోదసీలోకి దూసుకెళ్ళింది. అనుకున్న ప్రకారమే తొలి దశలను విజయవంతంగా పూర్తి చేసుకున్నట్లు రష్యా రోదసీ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. చైనా సరిహద్దుకు సమీపంలోని ఆమూర్ ప్రాంతంలో రాకెట్ను ప్రయోగిస్తున్న కార్యక్రమాన్ని జాతీయ టెలివిజన్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. వాతావరణ ఉపగ్రహంతో పాటు కెనడా, అమెరికా, జపాన్, జర్మనీ, స్వీడన్, నార్వేలకు చెందిన కంపెనీలు, సంస్థల పరికరాలను కూడా రోదసీలోకి తీసుకెళ్ళింది. రష్యా తన రోదసీ పరిశ్రమను ఆధునీకరించుకోవడానికి ఇటువంటి కాంట్రాక్టులు ఎంతగానో ఉపయోగపడతాయని ప్రధాని మెద్వెదెవ్ వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







