గ్రనెడ్తో సెల్ఫీ..ప్రణాలు కోల్పోయాడు
- November 29, 2017
మాస్కో: సెల్ఫీల పిచ్చితో ప్రాణాలు తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రాణాలు పోతాయని తెలిసి కూడా యువతతోపాటు పెద్దవారు కూడా ఇలాంటి చర్యలకు దిగుతుండటం విచారకరం. తాజాగా, రష్యాలో ఓ యువకుడు పిన్ పీకేసిన గ్రనెడ్తో సెల్ఫీకి ప్రయత్నించి ప్రణాలు కోల్పోయాడు.
వివరాల్లోకి వెళితే.. అలగ్జాండర్ సాష ఛెచిక్ అనే యువకుడు చేత్తో గ్రనేడ్ పట్టుకొని ఫొజులు పెడుతూ ఫొటోలు దిగాడు. వాటిని స్నేహితులతో పంచుకుంటూ ఎంజాయ్ చేశాడు. అవి చూసిన స్నేహితులు భయపడిపోయారు. పిచ్చి పనులు చెయ్యొద్దని, ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని.. దాన్ని పారేయమని హెచ్చరించారు.
అయినా, అలెగ్జాండర్ మాత్రం వినిపించుకోకుండా గ్రనేడ్కు ఉన్న పిన్ తీసేసి ఫొటోలు దిగబోయాడు. పిన్ తీయగానే అది కాస్తా పేలింది. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గ్రనేడ్కు ఉన్న పిన్ తీస్తే అది పేలిపోతుందని గ్రహించలేక సాష దాన్ని అలాగే పట్టుకొన్నాడు. అందువల్ల అది చేతిలోనే పేలిపోయి చనిపోయాడని పోలీసులు చెబుతున్నారు. అతనిది ఆత్మహత్య కాదని, పొరపాటున జరిగిన ప్రమాదమని పోలీసులు తెలిపారు.
ఇప్పటికైనా ఇటువంటి ప్రమాదకర విన్యాసాలు చేస్తూ సెల్ఫీలు తీసుకోవడానికి ప్రయత్నించడం యువత మానుకోవాలని పోలీసులు హితవు పలికారు. సెల్ఫీల పిచ్చితో ప్రాణాలు తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రాణాలు పోతాయని తెలిసి కూడా యువతతోపాటు పెద్దవారు కూడా ఇలాంటి చర్యలకు దిగుతుండటం విచారకరం. తాజాగా, రష్యాలో ఓ యువకుడు పిన్ పీకేసిన గ్రనెడ్తో సెల్ఫీకి ప్రయత్నించి ప్రణాలు కోల్పోయాడు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







