పవన్ అభిమానులకు ఈ వార్త నిజంగా పండగే

- November 29, 2017 , by Maagulf
పవన్ అభిమానులకు ఈ వార్త నిజంగా పండగే

ఇటు సినిమాలు, అటు రాజకీయాలతో బిజీ బిజీగా ఉంటున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో అజ్ఞాత వాసి అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.మరో 15 రోజులలో షూటింగ్ పూర్తి చేసుకోనున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. అయితే ఈ మూవీ తర్వాత తాను పూర్తి రాజకీయాలతోనే బిజీగా ఉంటాడని, 2019 వరకు మళ్ళీ ఏ సినిమా చేయడని పలు వార్తలు పుట్టుకొచ్చాయి. ఈ క్రమంలో ఆక్సీజన్ దర్శకుడు ఏఎం జ్యోతికృష్ణ( ఏఎం రత్నం తనయుడు) తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మెగా అభిమానులకి తట్టుకోలేని ఆనందాన్ని అందించాడు. 

2018 జనవరి నుండి పవన్ మరో సినిమా చేస్తాడని జ్యోతికృష్ణ అన్నారు. ఆర్ టీ నీసన్ డైరెక్ట్ చేయనున్న ఈ చిత్రం ఏఎం రత్నం నిర్మాణంలో రూపొందనుంది. తమిళ బ్లాక్ బస్టర్ చిత్రం వేదాళంకి రీమేక్‌గా ఈ మూవీ ఉంటుందని తెలుస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకోవడంతో పాటు ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలని కూడా పూర్తి చేసుకొని సెట్స్ పైకి వెళ్లడానికి రెడీగా ఉంది. ఇక మైత్రి మూవీ మేకర్స్ కూడా పవన్‌తో ఓ సినిమా చేయాలని భావిస్తున్నారు. కందిరీగ ఫేం సంతోష్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు సమాచారం.

విజయ్ హీరోగా రూపొందిన థేరి సినిమాకి రీమేక్‌గా ఈ మూవీ ఉంటుందని టాక్. మరి పవన్ 26, 27 సినిమాలకు సంబంధించి పూర్తి డీటైల్స్ ఎప్పుడు వస్తాయో చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com