పవన్ అభిమానులకు ఈ వార్త నిజంగా పండగే
- November 29, 2017
ఇటు సినిమాలు, అటు రాజకీయాలతో బిజీ బిజీగా ఉంటున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో అజ్ఞాత వాసి అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.మరో 15 రోజులలో షూటింగ్ పూర్తి చేసుకోనున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. అయితే ఈ మూవీ తర్వాత తాను పూర్తి రాజకీయాలతోనే బిజీగా ఉంటాడని, 2019 వరకు మళ్ళీ ఏ సినిమా చేయడని పలు వార్తలు పుట్టుకొచ్చాయి. ఈ క్రమంలో ఆక్సీజన్ దర్శకుడు ఏఎం జ్యోతికృష్ణ( ఏఎం రత్నం తనయుడు) తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మెగా అభిమానులకి తట్టుకోలేని ఆనందాన్ని అందించాడు.
2018 జనవరి నుండి పవన్ మరో సినిమా చేస్తాడని జ్యోతికృష్ణ అన్నారు. ఆర్ టీ నీసన్ డైరెక్ట్ చేయనున్న ఈ చిత్రం ఏఎం రత్నం నిర్మాణంలో రూపొందనుంది. తమిళ బ్లాక్ బస్టర్ చిత్రం వేదాళంకి రీమేక్గా ఈ మూవీ ఉంటుందని తెలుస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకోవడంతో పాటు ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలని కూడా పూర్తి చేసుకొని సెట్స్ పైకి వెళ్లడానికి రెడీగా ఉంది. ఇక మైత్రి మూవీ మేకర్స్ కూడా పవన్తో ఓ సినిమా చేయాలని భావిస్తున్నారు. కందిరీగ ఫేం సంతోష్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు సమాచారం.
విజయ్ హీరోగా రూపొందిన థేరి సినిమాకి రీమేక్గా ఈ మూవీ ఉంటుందని టాక్. మరి పవన్ 26, 27 సినిమాలకు సంబంధించి పూర్తి డీటైల్స్ ఎప్పుడు వస్తాయో చూడాలి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







