భాగ్యనగరం లో నిక్కర్ బ్యాచ్ హల్ చల్..!
- December 08, 2017
హైదరాబాద్: ఈ మద్య దొంగలు రక రకాలుగా వ్యూహాలు పన్నుతూ అందినంత దోచుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలో నిక్కర్ బ్యాచ్ అడుగుపెట్టేసింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసుల్లో సైతం కలవరం మొదలైంది. సుమారుగా 4 నుంచి 10 మంది కలసి ఓ ముఠాగా సంచరిస్తుంటారు. పగటి పూట బెలూన్లు, ఇతర ఆట వస్తువులను విక్రయిస్తూ తాళం వేసి ఉన్న సంపన్నుల ఇళ్ల సమాచారాన్ని ముఠాలోని మహిళా సభ్యులు పసిగడతారు. రాత్రి వేళల్లో ఆ ఇళ్లలో చోరీలు చేస్తూ అందినంత దోచుకుంటున్నారు.
వీరు తమ వెంట కత్తులు, ఇనుపరాడ్లు, గొడ్డళ్లతో సంచరిస్తుంటారని పేర్కొంటున్నారు. ఏమీ లేకపోతే చివరికి రాళ్లదాడికి సైతం వీరు వెనుకాడరు. ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత లోపల ఎవరైనా ఉన్నట్టు గుర్తిస్తే వెంటనే వారిని భయపెట్టి తాళ్లతో కట్టేయడం దాడి చేయడం..అవసరమైతే చంపడానికి కూడా వెనుకాడటం లేదు. ఇప్పటికే మియాపూర్, కూకట్ పల్లి తదితర ప్రాంతాల్లో ఈ ముఠా సంచరిస్తోంది.
ఈ ప్రాంతంలో పలు చోరీలు జరగ్గా, దర్యాప్తులో భాగంగా రంగంలోకి దిగిన పోలీసులు పలు అపార్ట్ మెంట్లలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తే విషయం వెలుగు చూసింది. మరోవైపు పోలీసులు రాత్రి వేళల్లో ఓంటరి ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. వీరిని పట్టుకునేందుకు నగరంలోని అన్ని కమిషనరేట్ల పరిధిలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.
తాజా వార్తలు
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!
- కువైట్ లో 16 మంది హిజ్బుల్లా అనుబంధ సభ్యులు అరెస్ట్..!!
- అల్ తుమామా స్టేడియం ఇంటర్చేంజ్ రోడ్ మూసివేత..!!
- బని యాస్ ప్రాంతంలో పాకిస్తానీ ప్రవాసి మృతి..అబుదాబి
- విశాఖకు సెమీ రింగ్ రోడ్!
- మార్చి 20న అసెంబ్లీకి తెలంగాణ బడ్జెట్
- ఏసీ టూరిస్ట్ రైల్లో శ్రీ రామాయణ యాత్ర..మార్చి 30న ప్రారంభం..









