ఎడారిలో వేటకొచ్చిన 'సాహో' డైరెక్టర్
- December 11, 2017
డైరెక్టర్ సుజిత్ ఎడారి లో బిజీ బిజీ గా గడిపేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన ప్రభాస్ తో సాహో మూవీ తెరకెక్కిస్తున్న సంగతి తెల్సిందే. మొన్నటి వరకు ఈ చిత్ర షెడ్యూల్ హైదరాబాద్ లో జరిగింది. నెక్స్ట్ షెడ్యూల్ దుబాయ్ లోని ఎడారి లో ప్లాన్ చేసారు. ఇందుకు గాను హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ తో కలిసి సుజిత్ ఆ లొకేషన్స్ వేట లో పడ్డాడు.
బుర్జ్ ఖలీఫా టవర్, రస్-అల్-ఖమా వరల్డ్ ట్రేడ్ సెంటర్, అబుదాబిలోని ఇతిహాద్ టవర్ తో పాటు దుబాయ్ శివార్లలోని భారీ ఎడారి, కొండల మధ్య ఛేజింగ్ సన్నివేశాలు తీయబోతున్నారు. సినిమాలో ఉండే 20 నిమిషాల భారీ యాక్షన్ పార్ట్ కోసం ఈ లొకేషన్స్ ను సెలెక్ట్ చేశారట. జనవరి నుంచి ఈ షెడ్యూల్ మొదలు పెట్టబోతున్నారని సమాచారం.
యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై దాదాపు 150కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కబోతుంది. తెలుగు , హిందీ , తమిళ్ భాషల్లో ఈ మూవీ రాబోతుంది. ప్రభాస్ కు జోడిగా శ్రద్ద కపూర్ నటిస్తుంది.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







