ఎడారిలో వేటకొచ్చిన 'సాహో' డైరెక్టర్
- December 11, 2017
డైరెక్టర్ సుజిత్ ఎడారి లో బిజీ బిజీ గా గడిపేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన ప్రభాస్ తో సాహో మూవీ తెరకెక్కిస్తున్న సంగతి తెల్సిందే. మొన్నటి వరకు ఈ చిత్ర షెడ్యూల్ హైదరాబాద్ లో జరిగింది. నెక్స్ట్ షెడ్యూల్ దుబాయ్ లోని ఎడారి లో ప్లాన్ చేసారు. ఇందుకు గాను హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ తో కలిసి సుజిత్ ఆ లొకేషన్స్ వేట లో పడ్డాడు.
బుర్జ్ ఖలీఫా టవర్, రస్-అల్-ఖమా వరల్డ్ ట్రేడ్ సెంటర్, అబుదాబిలోని ఇతిహాద్ టవర్ తో పాటు దుబాయ్ శివార్లలోని భారీ ఎడారి, కొండల మధ్య ఛేజింగ్ సన్నివేశాలు తీయబోతున్నారు. సినిమాలో ఉండే 20 నిమిషాల భారీ యాక్షన్ పార్ట్ కోసం ఈ లొకేషన్స్ ను సెలెక్ట్ చేశారట. జనవరి నుంచి ఈ షెడ్యూల్ మొదలు పెట్టబోతున్నారని సమాచారం.
యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై దాదాపు 150కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కబోతుంది. తెలుగు , హిందీ , తమిళ్ భాషల్లో ఈ మూవీ రాబోతుంది. ప్రభాస్ కు జోడిగా శ్రద్ద కపూర్ నటిస్తుంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల