ఎడారిలో వేటకొచ్చిన 'సాహో' డైరెక్టర్

- December 11, 2017 , by Maagulf
ఎడారిలో వేటకొచ్చిన 'సాహో' డైరెక్టర్

డైరెక్టర్ సుజిత్ ఎడారి లో బిజీ బిజీ గా గడిపేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన ప్రభాస్ తో సాహో మూవీ తెరకెక్కిస్తున్న సంగతి తెల్సిందే. మొన్నటి వరకు ఈ చిత్ర షెడ్యూల్ హైదరాబాద్ లో జరిగింది. నెక్స్ట్ షెడ్యూల్ దుబాయ్ లోని ఎడారి లో ప్లాన్ చేసారు. ఇందుకు గాను హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ తో కలిసి సుజిత్ ఆ లొకేషన్స్ వేట లో పడ్డాడు.

బుర్జ్ ఖలీఫా టవర్, రస్-అల్-ఖమా వరల్డ్ ట్రేడ్ సెంటర్, అబుదాబిలోని ఇతిహాద్ టవర్ తో పాటు దుబాయ్ శివార్లలోని భారీ ఎడారి, కొండల మధ్య ఛేజింగ్ సన్నివేశాలు తీయబోతున్నారు. సినిమాలో ఉండే 20 నిమిషాల భారీ యాక్షన్ పార్ట్ కోసం ఈ లొకేషన్స్ ను సెలెక్ట్ చేశారట. జనవరి నుంచి ఈ షెడ్యూల్ మొదలు పెట్టబోతున్నారని సమాచారం.

యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై దాదాపు 150కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కబోతుంది. తెలుగు , హిందీ , తమిళ్ భాషల్లో ఈ మూవీ రాబోతుంది. ప్రభాస్ కు జోడిగా శ్రద్ద కపూర్ నటిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com