దోహలో 'దోహా కుటుంబం' వారి నేతృత్వంలో నేత్రపర్వంగా దీపావళి
- November 16, 2015
దోహాలో కార్నిష్ సమీపంలో ఉన్న ఎలిగెన్స్ కేజిల్ హోటల్ లో కతార్ లోని తెలుగు వారి ప్రముఖ సంస్కృతిక సంస్థ 'దోహా కుటుంబం' వారి నేతృత్వంలో తేది 13.11.15 న నేత్ర పర్వంగా నిర్వహింపబడ్డాయి. ఈ ఈవెంట్ లో 70 మంది దాకా పాల్గొన్నారు. ఈ దీపావళి సంబరాలు, చిన్నారుల ప్రార్ధనతో మహిళా మణుల జ్యోతి ప్రజ్వలనతో సుభారంబమయ్యాయి. అనంతరం వారు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. ఇంకా ఈ కార్యక్రమంలో కొందరు మహిళలు ఆవరణను రంగవల్లులతో సుందరంగా తీర్చిదిద్దారు. తరువాతి అంశాలుగా పిల్లల సోలో, డ్యూయెట్ మరియు బృంద నృత్య ప్రదర్సనలు, స్త్రీమూర్తుల నృత్య గాన ప్రదర్శనలు సాగాయి. పిల్లలు, పెద్దల కోసం ఆటల పోటీలు, పెళ్ళైన వారి సంయుక్త ఆటలు, సాముహిక క్రీడలతో అక్కడి వాతావరణం కోలాహలంగా మారింది. ఆబాలగోపాలం ఇక్కడకు విచ్చేసిన ఆటపాటల్లో మురిసిపోయారు. గ్రూప్ ఫోటోగ్రఫీ, బహుమతుల పంపిణీ తో ఈ కార్యక్రమానికి భరతవాక్యం పలికి, మరల త్వరలోనే కలసుకోనేందుకు ఉవ్విళ్ళూరుతూ అందరూ వీడ్కోలు పలికారు.




తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







