మాల్దీవులలో సేదతీరానున్న చంద్రబాబు కుటుంబం

- December 14, 2017 , by Maagulf
మాల్దీవులలో సేదతీరానున్న చంద్రబాబు కుటుంబం

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన కుటుంబంతో కలిసి ఐదురోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 18 నుంచి 22 వరకు ఆయన మాల్దీవుల్లో పర్యటించనున్నారు. ఆయన ఏటా తన కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్తుంటారు. చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి, తనయుడు లోకేశ్‌, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్‌ వెళ్లనున్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి లోకేశ్‌ తన పర్యటన ముగించుకుని నేరుగా మాల్దీవులు చేరుకోనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com