హైదరాబాద్ శివారులో గుప్తనిధుల కలకలం..
- December 14, 2017
హైదరాబాద్ శివారులో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపాయి. అర్ధరాత్రి పూట రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లిలోని ఓ పురాతన భవనంలోకి హైదరాబాద్కు చెందిన నలుగురు ప్రవేశించడానికి ప్రయత్నించారు. స్థానికులు అనుమానంతో ప్రశ్నించగా వారు పొంతన లేని సమాధానాలు చెప్పారు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పురాతన భవనంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన వారిలో ఓ సాధువు ఉన్నారు. దీంతో గుప్త నిధుల కోసమే వారు వచ్చినట్టు అనుమానిస్తున్నారు.
గుంటూరు జిల్లాకు చెందిన నలుగురు కుషాయిగూడలోని ఓ ఆశ్రమంలో ఉంటున్నారు. వీరంతా రాత్రి పూట మేడిపల్లికి చేరుకొని ఓ పురాతన భవనంలోకి ప్రవేశించడం గ్రామంలో కలకలం సృష్టించింది. స్థానికులు గుప్త నిధుల కోసమే వీరు వచ్చినట్టు చెబుతున్నారు. పోలీసులు ఆ కోణంలోను దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







