టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.!
- December 17, 2017
శ్రీలంకతో జరగనున్న చివరిదైన మూడో వన్డేలో టాస్ నెగ్గిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఛేజింగ్ వైపు మొగ్గు చూపాడు. టాస్ నెగ్గిన వెంటనే ఫీల్డింగ్ చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు. ఇదివరకే సిరీస్ లో లంక, భారత్లు 1-1తో సమ ఉజ్జీలుగా ఉన్నాయి. సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే మూడో వన్డేలో నెగ్గి మరో సిరీస్ను తన ఖాతాలో వేసుకోవాలని రోహిత్ సేన ఎదురుచూస్తోంది. మరోవైపు భారతగడ్డమీద టీమిండియాపై ఎలాగైనా తొలి వన్డే సిరీస్ కైవసం చేసుకోవాలని లంకేయులు ఉవ్విళ్లూరుతున్నారు.
భారత జట్టులో ఓ మార్పు చేశారు. కొత్త కుర్రాడు వాషింగ్టన్ సుందర్కు నిరాశ ఎదురైంది. కీలకమైన మూడో వన్డేలో బౌలింగ్ దాడిని పెంచాలని అతడి స్థానంలో కుల్దీప్ యాదవ్ ను జట్టులోకి తీసుకున్నారు.
జట్ల వివరాలు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), ధావన్, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, మనీశ్ పాండే, ధోని, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్, బుమ్రా, చహల్, కుల్దీప్ యాదవ్.
శ్రీలంక: తిసారా పెరీరా (కెప్టెన్), గుణతిలక, తరంగా, సమరవిక్రమ, మాథ్యూస్, డిక్వెలా, గుణరత్నే, సచిత్, లక్మల్, అకిల ధనంజయ, నువాన్ ప్రదీప్.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







