ప్రత్యేక హోదా కోసం దీక్ష చేపట్టిన శివాజీ...
- May 02, 2015
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం ఈరోజు గుంటూరులో 10గంటల నుండి నిరాహార దీక్ష చేపడుతున్నట్లు హీరో శివాజీ స్పష్టం చేశారు. నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఏపీ ప్రత్యేక హోదా కోసం చివరి వరకు పోరాడుతానని తేల్చి చెప్పారు. ప్రజల కోసమే ఈ పోరాటం చేపడుతున్నానని, ఎవరు మద్దతు ఇచ్చినా... ఇవ్వకపోయినా ఉద్యమం కొనసాగుతుందన్నారు. తనది పోరాటమే తప్ప ఇందులో ఎలాంటి రాజకీయం లేదన్నారు. తన పోరాటం అన్ని పార్టీల్లో ఉన్నవారి పిల్లల భవిష్యత్ కోసమేనని చెప్పారు. తాను చేసే ఈ దీక్షతో ఎవరికీ ఇబ్బంది ఉండదని, పోలీసులకు పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు. తాను దీక్ష చేసే స్థలం నుంచి ఖాళీ చేయిస్తే మరో చోటైనా దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు. గుంటూరు వదిలి మాత్రం వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చినా తాను సామాజిక కార్యకర్తలానే పనిచేస్తానని వెల్లడించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







