ఒమన్ లో విద్యుత్ షాక్ కు గురై ప్రవాసీయుడు మృతి

- December 18, 2017 , by Maagulf
ఒమన్ లో విద్యుత్ షాక్ కు గురై ప్రవాసీయుడు మృతి

మస్కట్ : మృత్యువు ఆ ప్రవాసీయుడిని విద్యుత్ తీగల రూపంలో బలికొంది.  ఓమన్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఏసిఎడిఏ) తెలిపిన సమాచారం ప్రకారం తీవ్రమైన విద్యుత్ షాక్ కు గురైన ఒక ప్రవాసీయుడు మరణించినట్లు తెలిపింది. మస్కట్ నుండి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్-దహిరా గవర్నైట్లో ఇబ్రి సమీపంలో అకస్మాత్తుగా ఒక వ్యక్తిపై విద్యుత్ స్థంభం కూలిపోవడంతో అత్యవసర సేవలు మరియు ఆసుపత్రి సిబ్బంది  అ ప్రవాసీయుని  జీవితాన్ని కాపాడటానికి తీవ్రంగా ప్రయత్నించారు. ఆ వ్యక్తిని కాపాడేందుకు హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే ప్రాణాలు కోల్పోయినట్లు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రత్యక్ష సాక్షి అలీ అల్-ఘఫ్రీ మాట్లాడుతూ, " ఒక వ్యక్తి ట్రక్కులో చెత్తను రవాణా చేస్తున్నాడు.వాహనం విద్యుత్ తీగలకు తగిలింది. దాంతో ఆ వ్యక్త్తో తన చేతులతో విద్యుత్ వైర్లను తొలగించటానికి ప్రయత్నించినప్పుడ ఆ వ్యక్తి తీవ్రమైన విద్యుత్ షాక్ గురయ్యాడు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com