ఎన్నికల ఫలితాలు నన్ను గందరగోళానికి గురిచేస్తున్నాయి: కేటీఆర్
- December 18, 2017
హైదరాబాద్: గుజరాత్, హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. తొలుత రెండుచోట్లా కాంగ్రెస్, భాజపా పోటాపోటీగా ఉన్నాయి. అయితే క్రమంగా భాజపా బలం పుంజుకుని రెండు రాష్ట్రాల్లోనూ అధికారం చేపట్టే దిశగా పయనిస్తోంది. అయితే ఈ ఎన్నికల ఫలితాలు తనను గందరగోళానికి గురిచేస్తున్నాయని అంటున్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్.
గుజరాత్, హిమాచల్ప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై ఒక్కో ఛానెల్ ఒక్కో విధంగా ఆధిక్యం చూపుతూ కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. వారి అభిప్రాయాలు, ఇతర విషయాలను నేను అర్థం చేసుకోగలను. అయితే నిజాలు, సంఖ్యలు ఎలా మారతాయి అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
కేటీఆర్ ట్వీట్పై కొందరు నెటిజన్లు సరదాగా స్పందించారు. కొందరు టీవీ స్విచ్ఛాప్ చేసుకోమని సలహా ఇస్తే.. మరికొందరు ఛానెళ్లను ఫాలో కావొద్దని సూచించారు. కేవలం ఎన్నికల సంఘం ఫలితాలను ఫాలో అయితే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉండదని మరికొందరు నెటిజన్లు సలహా ఇచ్చారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!