గల్ఫ్ లో సత్యనారాయణ వ్రతం చేసిన పలువురు భారతీయులకి శిక్ష
- November 17, 2015
సత్యనారాయణ వ్రతం చేసినందుకు 9 మంది గల్ఫ్ బహిష్కరణ శ్లోకాలు చదివి ఇతరులకు ఇబ్బంది కలిగించారని కేసు అనుమతి లేకుండా సత్యనారాయణ వ్రతం చేసి, గట్టిగా శ్లోకాలను చదివి ఇతరులకు ఇబ్బంది కల్గించారనే అభియోగంపై తొమ్మిది మంది భారతీయులు దేశ బహిష్కరణకు గురయ్యారు. కువైట్లో వివిధ హోదాలలో పని చేస్తున్న కర్ణాటక రాష్ట్రంలోని మంగళూర్, ఉడిపి ప్రాంతాలకు చెందిన ప్రవాసీయులు భారతీయ ఎంబసీ అనుమతితో ఒక ప్రవాసీ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సంఘం ఆధ్వర్యంలో దశాబ్ద కాలంగా సత్యనారాయణ వ్రతం సహా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా వ్రతం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వారంతా గట్టిగా శ్లోకాలను చదవడంతో తమకు ఇబ్బంది కలిగిదంటూ చుట్టుపక్కల ఉన్న అరబ్బులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పూజా కార్యక్రమంతో సంబంధం ఉన్న 11 మందిని అరెస్ట్ చేశారు. నెలరోజుల పాటు కస్టడీలో ఉంచారు. తర్వాత వారిలో 9 మంది వీసాలను రద్దు చేసి కువైట్ నుంచి బహిష్కరించారు. అంతేకాదు వీరు తమ జీవిత కాలంలో ఏ గల్ఫ్ దేశంలోనూ ప్రవేశించకుండా నిషేధం విధించారు. వీరిపై దేశ బహిష్కరణ శిక్ష విధించకుండా భారతీయ ఎంబసీ, సహా కర్ణాటకకు చెందిన కేంద్ర మంత్రి అనంతకుమార్, ఇతర నేతలు ప్రయత్నించినా కువైట్ పోలీసులు ఒప్పుకోలేదని తెలిసింది. ఇదే కారణంతో గత ఏడాది సౌదీ అరేబియాలోనూ కర్ణాటక, కేరళ రాష్ర్టాలకు చెందిన క్రైస్తవులపై కఠిన చర్యలు తీసుకొన్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!









