పారిస్ మేయర్ని కలిసిన కతార్ ప్రధాన మంత్రి
- November 17, 2015
కతార్ ప్రధాన మంత్రి మరియు అంతరంగిక శాఖా మంత్రి - హిజ్ హైనెస్ షేక్ అబ్దుల్లా బిన్ నస్సేర్ బిన్ ఖలీఫా అల్ థాని, పారిస్ మేయర్ అన్నే హిడాల్గోను కలిసారు. ఈ సమావేశంలో, ద్వైపాక్షిక సహకారం మరియు దానిని అభివృద్ధి చేసే విధానాలను గూర్చి చర్చించారు. ఫ్రెంచ్ నేషనల్ జెండేర్మరి డైరక్టర్ జనరల్ - డెనిస్ ఫెవియర్ ను కూడా ఆయన కలిసారు. కతార్ రాయబార కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో - ముఖ్యంగా భద్రతా సంబంధమైన పరస్పర విషయాలు, వానిని పెంపొందించే విధానాలను గూర్చి చర్చించారు. కాగా నేడు కతార్ ప్రధాని, ఫ్రాన్స్ అధ్యక్షులు ఫ్రంకొఇస్ హాలండ్ మరియు ప్రధాని మన్యుఅల్ వాల్ల్స్ తో నేడు సంప్రదింపులు జరుపుతారు. కాగా ప్రధాని, ఇటీవల పారిస్ దాడిని జరిగిన తీవ్రంగా ఖండిస్తూ, తీవ్రవాదాన్ని కలసికట్టుగా తరిమి కొట్టడంలో ఫ్రాన్స్ ప్రభుత్వానికి తమ పూర్తి మద్దతును ప్రకటించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







