పారిస్ మేయర్ని కలిసిన కతార్ ప్రధాన మంత్రి
- November 17, 2015
కతార్ ప్రధాన మంత్రి మరియు అంతరంగిక శాఖా మంత్రి - హిజ్ హైనెస్ షేక్ అబ్దుల్లా బిన్ నస్సేర్ బిన్ ఖలీఫా అల్ థాని, పారిస్ మేయర్ అన్నే హిడాల్గోను కలిసారు. ఈ సమావేశంలో, ద్వైపాక్షిక సహకారం మరియు దానిని అభివృద్ధి చేసే విధానాలను గూర్చి చర్చించారు. ఫ్రెంచ్ నేషనల్ జెండేర్మరి డైరక్టర్ జనరల్ - డెనిస్ ఫెవియర్ ను కూడా ఆయన కలిసారు. కతార్ రాయబార కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో - ముఖ్యంగా భద్రతా సంబంధమైన పరస్పర విషయాలు, వానిని పెంపొందించే విధానాలను గూర్చి చర్చించారు. కాగా నేడు కతార్ ప్రధాని, ఫ్రాన్స్ అధ్యక్షులు ఫ్రంకొఇస్ హాలండ్ మరియు ప్రధాని మన్యుఅల్ వాల్ల్స్ తో నేడు సంప్రదింపులు జరుపుతారు. కాగా ప్రధాని, ఇటీవల పారిస్ దాడిని జరిగిన తీవ్రంగా ఖండిస్తూ, తీవ్రవాదాన్ని కలసికట్టుగా తరిమి కొట్టడంలో ఫ్రాన్స్ ప్రభుత్వానికి తమ పూర్తి మద్దతును ప్రకటించారు.
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









