పారిస్ మేయర్ని కలిసిన కతార్ ప్రధాన మంత్రి
- November 17, 2015
కతార్ ప్రధాన మంత్రి మరియు అంతరంగిక శాఖా మంత్రి - హిజ్ హైనెస్ షేక్ అబ్దుల్లా బిన్ నస్సేర్ బిన్ ఖలీఫా అల్ థాని, పారిస్ మేయర్ అన్నే హిడాల్గోను కలిసారు. ఈ సమావేశంలో, ద్వైపాక్షిక సహకారం మరియు దానిని అభివృద్ధి చేసే విధానాలను గూర్చి చర్చించారు. ఫ్రెంచ్ నేషనల్ జెండేర్మరి డైరక్టర్ జనరల్ - డెనిస్ ఫెవియర్ ను కూడా ఆయన కలిసారు. కతార్ రాయబార కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో - ముఖ్యంగా భద్రతా సంబంధమైన పరస్పర విషయాలు, వానిని పెంపొందించే విధానాలను గూర్చి చర్చించారు. కాగా నేడు కతార్ ప్రధాని, ఫ్రాన్స్ అధ్యక్షులు ఫ్రంకొఇస్ హాలండ్ మరియు ప్రధాని మన్యుఅల్ వాల్ల్స్ తో నేడు సంప్రదింపులు జరుపుతారు. కాగా ప్రధాని, ఇటీవల పారిస్ దాడిని జరిగిన తీవ్రంగా ఖండిస్తూ, తీవ్రవాదాన్ని కలసికట్టుగా తరిమి కొట్టడంలో ఫ్రాన్స్ ప్రభుత్వానికి తమ పూర్తి మద్దతును ప్రకటించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!









