దుబాయ్ సఫారీ వైపు వెళ్ళే రోడ్లపై భారీ ట్రాఫిక్
- December 20, 2017
దుబాయ్ సఫారీలోకి ఉచిత ప్రవేశం నేటితో ఆఖరుకావడంతో, అటు వైపుగా వెళ్ళే దుబాయ్లోని రోడ్లన్నీ హెవీ ట్రాఫిక్తో నిండిపోయాయి. రస్ అల్ ఖోర్, ఎస్ఎంబిజెడ్ రోడ్ ట్రాఫిక్తో నిండిపోయాయని దుబాయ్ పోలీసులు ట్విట్టర్లో ట్రాఫిక్ అలర్ట్ కూడా పెట్టడం జరిగింది. షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్పై ట్రాఫిక్ కారణంగా ఇ44 అల్ అవీర్ రోడ్, రస్ అల్ ఖోర్ ఇండస్ట్రియల్ ఏరియా వద్ద రోడ్స్పై వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఇటీవల సందర్శకులకు ఎంట్రీ గేట్స్ తెరుచుకోగా, దుబాయ్ సఫారీ పార్క్కి ఇప్పటికే 100,000 మంది విచ్చేశారు. రేపటినుంచి, అంటే డిసెంబర్ 21 నుంచి సందర్శకులకు టిక్కెట్ ద్వారా మాత్రమే ప్రవేశం ఉంటుంది. బుధవారం చివరి రోజున ఫ్యామిలీస్కి మాత్రమే ప్రవేశం కల్పిస్తున్నారు దుబాయ్ సఫారీ పార్క్ నిర్వాహకులు. అత్యాధునిక హంగులతో, ప్రపంచంలో వివిధ దేశాల నుంచి రప్పించిన పలు రకాలైన జంతువులు ఈ పార్క్లో సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. దుబాయ్ సఫారీ పార్క్, అరేబియన్ విలేజ్, ఆఫ్రికన్ విలేజ్, ఆసియన్ విలేజ్, అల్వాది మరియు సఫారీ విలేజ్ సందర్శన కోసం నిర్దేశించిన కాంబో టిక్కెట్ ధరలు పిల్లలకు 30 దిర్హామ్లు, పెద్దలకు 85 దిర్హామ్లుగా నిర్ధారించారు. సీనియర్ సిటిజన్లు, అలాగే మూడేళ్ళలోపు చిన్నారులకు ప్రవేశం ఉచితం.
తాజా వార్తలు
- సౌదీలో స్ట్రోక్తో చిక్కుకున్న హైదరాబాద్ ప్రవాసికి ఊరట.. కుటుంబంతో మళ్లీ కలిపిన యూసుఫ్ అలీ
- తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన స్కైరూట్ ఏరోస్పేస్ వ్యవస్థాపకులు
- పోస్టల్ సేవలపై జీఎస్టీ తొలగించాలి..కేంద్రాన్ని కోరిన ఎంపీ బాలశౌరి
- యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్సభలో ఆమోదం..లీక్ పాల్పడితే పదేళ్ల జైలు..రూ.10 కోట్ల జరిమానా!
- ఆగస్టు 1 నుంచి మారనున్న స్పీడ్ పోస్ట్ ఛార్జీలు..పూర్తి వివరాలు ఇవే!
- తైవాన్ పారిశ్రామిక దిగ్గజాలతో సీఎం చంద్రబాబు భేటీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం
- బహ్రెయిన్లో డొమెస్టిక్ వర్కర్ కు 5 ఏళ్ల జైలు, భారీ జరిమానా..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ తో స్పెయిన్ ప్రధాని చర్చలు..!!
- ఖతార్లో పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యానికి ప్రత్యేక క్లినిక్..!!
- ధోఫార్లోని వాడి జర్జీజ్లో వ్యక్తిని రక్షించిన సివిల్ డిఫెన్స్..!!







