దుబాయ్ సఫారీ వైపు వెళ్ళే రోడ్లపై భారీ ట్రాఫిక్
- December 20, 2017
దుబాయ్ సఫారీలోకి ఉచిత ప్రవేశం నేటితో ఆఖరుకావడంతో, అటు వైపుగా వెళ్ళే దుబాయ్లోని రోడ్లన్నీ హెవీ ట్రాఫిక్తో నిండిపోయాయి. రస్ అల్ ఖోర్, ఎస్ఎంబిజెడ్ రోడ్ ట్రాఫిక్తో నిండిపోయాయని దుబాయ్ పోలీసులు ట్విట్టర్లో ట్రాఫిక్ అలర్ట్ కూడా పెట్టడం జరిగింది. షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్పై ట్రాఫిక్ కారణంగా ఇ44 అల్ అవీర్ రోడ్, రస్ అల్ ఖోర్ ఇండస్ట్రియల్ ఏరియా వద్ద రోడ్స్పై వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఇటీవల సందర్శకులకు ఎంట్రీ గేట్స్ తెరుచుకోగా, దుబాయ్ సఫారీ పార్క్కి ఇప్పటికే 100,000 మంది విచ్చేశారు. రేపటినుంచి, అంటే డిసెంబర్ 21 నుంచి సందర్శకులకు టిక్కెట్ ద్వారా మాత్రమే ప్రవేశం ఉంటుంది. బుధవారం చివరి రోజున ఫ్యామిలీస్కి మాత్రమే ప్రవేశం కల్పిస్తున్నారు దుబాయ్ సఫారీ పార్క్ నిర్వాహకులు. అత్యాధునిక హంగులతో, ప్రపంచంలో వివిధ దేశాల నుంచి రప్పించిన పలు రకాలైన జంతువులు ఈ పార్క్లో సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. దుబాయ్ సఫారీ పార్క్, అరేబియన్ విలేజ్, ఆఫ్రికన్ విలేజ్, ఆసియన్ విలేజ్, అల్వాది మరియు సఫారీ విలేజ్ సందర్శన కోసం నిర్దేశించిన కాంబో టిక్కెట్ ధరలు పిల్లలకు 30 దిర్హామ్లు, పెద్దలకు 85 దిర్హామ్లుగా నిర్ధారించారు. సీనియర్ సిటిజన్లు, అలాగే మూడేళ్ళలోపు చిన్నారులకు ప్రవేశం ఉచితం.
తాజా వార్తలు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!