నెల్లూరులో స్వల్ప భూప్రకంపనలు

- November 18, 2015 , by Maagulf
నెల్లూరులో స్వల్ప భూప్రకంపనలు

నెల్లూరు జిల్లాలో బుధవారం రాత్రి స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి. వింజమూరు మండలం చాకలికొండ, గొల్లవారపల్లి, పత్తినివారిపల్లిలో భూమి కంపించింది. వింజమూరు మండలంలో ఏకంగా 5 సెకన్లపాటు ఈ ప్రకంపనలు కనిపించాయి. దీంతో ప్రజలు భయాందోళనలతో పరుగులుతీశారు.జల్‌పల్లి గ్రామంలో పది సెకన్లపాటు కంపించిన భూమిపహాడీషరీఫ్‌: రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌ మండలం జల్‌పల్లి గ్రామంలో బుధవారం రాత్రి 8:15 గంటలకు పది సెకన్లపాటు భూమి కంపించింది. పలువురు పిల్లలతో కలిసి బయట వీధుల్లోకి చేరుకుని ఏం జరుగుతుందోనని ఆందోళనకు గురయ్యారు. చాలామంది భూమి కంపిస్తోందని గుర్తించేలోగానే ప్రకంపనలు ఆగిపోయాయి. జల్‌పల్లి వాదిహుదా, శ్రీరామకాలనీ, షాహిన్‌నగర్‌ ప్రాంతాల్లో ఈ ప్రకంపన చోటుచేసుకుంది. ఈ విషయమై శాస్త్రవేత్తలను సంప్రదించగా భూమి కంపించిన విషయాన్ని ధ్రువీకరించలేదు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com