హైదరాబాదీకి ఒమాన్ దేశ భర్త ఫోన్ ద్వారా తలాఖ్ ఇచ్చిన వైనం
- December 25, 2017
హైదరాబాద్ : హైదరాబాద్ నగరానికి చెందిన వివాహితకు ఒమన్ దేశానికి చెందిన భర్త ఫోన్ ద్వారా తలాఖ్ ఇచ్చిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ నగరంలోని ఎర్రకుంటకు చెందిన గౌసియాబేగంను ఒమన్ దేశానికి చెందిన జహ్రాన్ హమీద్ అల్ రాజి 2008 ఆగస్టు 11వతేదీన పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి సమయంలో భార్య గౌసియాకు ఇల్లు నిర్మించి ఇచ్చి పదిలక్షల రూపాయల నగదు ఇస్తానని హామి ఇచ్చాడు. పెళ్లి అనంతరం నెలానెలా డబ్బు పంపిస్తూ అప్పుడప్పుడు వచ్చి పోతుండే జహ్రాన్ ఉన్నట్టుండి ఓ రోజు ఫోన్ చేసి తలాఖ్ చెప్పి ఫోన్ కట్ చేశాడని గౌసియా బేగం దేశ విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ కు ఫిర్యాదు చేసింది. తాను ఫోన్ చేసినా సమాధానం ఇవ్వడం లేదని ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని గౌసియా కేంద్రమంత్రిని కోరారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







