బాబాయ్.. అబ్బాయ్ లు వెబ్ సిరీస్ తో సందడి..!!
- December 25, 2017
తెలుగు లో వెబ్ సిరీస్ కు ప్రాముఖ్యం తెచ్చింది.. మెగా తనయ నీహారిక అని చెప్పవచ్చు.. అప్పటి నుంచి వెబ్ సిరీస్ హవా ఓ రేంజ్ లో కొనసాగుతున్నది. నాగార్జున, బాహుబలి వంటి సినిమాను నిర్మించిన బడా నిర్మాతలు సైతం వెబ్ సిరీస్ నిర్మాణ రంగంలో అడుగు పెట్టారు. వెబ్ సిరీస్ లో నటించడానికి ఇప్పటి వరకూ ఏ బడా హీరో ఆసక్తిని చూపించలేదు.. తాజాగా ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హత్య నేపథ్య అంశంతో... "ఎల్ టీటీఈ" అనే పేరుతో ఓ వెబ్ సిరీస్ రూపొందనున్నది. ఈ వెబ్ సిరీస్ లో ఐపీఎస్ అధికారి కార్తికేయన్ గా వెంకటేష్, ఓ కీలక పాత్రలో రానా నటించనున్నాడు అని టాక్ వినిపిస్తోంది. కథగా చెప్పాలంటే మూడు గంటల్లో పూర్తిగా చెప్పడం కష్టం అని.. అందుకనే ఈ స్టోరీని సినిమాకంటే.. వెన్ సిరీస్ గా ఐతే బాగుంటుందని భావించి నట్లు దర్శకుడు ఏఎంఆర్ రమేశ్ చెప్పారు.. ఈ వెబ్ సిరీస్ ను దక్షిణాది భాషలతో పాటు.. హిందీలో కూడా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







