మరోసారి మెగాస్టార్ పాట రీమేక్‌ తో రానున్న సాయి ధరమ్ తేజ్

- December 29, 2017 , by Maagulf
మరోసారి మెగాస్టార్ పాట రీమేక్‌ తో రానున్న సాయి ధరమ్ తేజ్

ఇప్పటికే మెగాస్టార్‌ చిరంజీవి నటించిన బ్లాక్‌బస్టర్‌ చిత్రాల్లోని సూపర్‌హిట్‌ పాటలు రీమేక్‌గా వచ్చాయి. రామ్‌చరణ్‌ నటించిన 'మగధీర' చిత్రంలో 'బంగారుకోడిపెట్ట', 'రచ్చ'లో 'వానా వానా వెల్లువాయే', 'నాయక్‌'లో 'శుభలేక రాసుకున్నా..' పాటలు వచ్చాయి. అదేవిధంగా సాయి ధరమ్‌ తేజ్‌ నటించిన చిత్రాల్లో 'గోలీమార్‌..', 'గువ్వ గోరింక', 'అందం హిందోళం' పాటల రీమేక్‌లు సందడి చేశాయి. ఇప్పుడు 1990లో చిరంజీవి నటించిన 'కొండవీటి దొంగ' చిత్రంలోని ఓ సూపర్‌ హిట్‌ పాటను ధరమ్‌ తేజ్‌ చిత్రంలో రీమేక్‌ చేయనున్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. 'జవాన్‌' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ధరమ్‌ తేజ్‌ ప్రస్తుతం వి.వి. వినాయక్‌ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇందులో 'చమకు చమకు ఛాం..' పాటను రీమేక్‌ చేయనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ సినిమాలో ధరమ్‌ తేజ్‌కు జోడీగా లావణ్య త్రిపాఠి నటిస్తున్నారు. సి.కల్యాణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 2018 ఫిబ్రవరి 9న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com