మరోసారి మెగాస్టార్ పాట రీమేక్ తో రానున్న సాయి ధరమ్ తేజ్
- December 29, 2017
ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్బస్టర్ చిత్రాల్లోని సూపర్హిట్ పాటలు రీమేక్గా వచ్చాయి. రామ్చరణ్ నటించిన 'మగధీర' చిత్రంలో 'బంగారుకోడిపెట్ట', 'రచ్చ'లో 'వానా వానా వెల్లువాయే', 'నాయక్'లో 'శుభలేక రాసుకున్నా..' పాటలు వచ్చాయి. అదేవిధంగా సాయి ధరమ్ తేజ్ నటించిన చిత్రాల్లో 'గోలీమార్..', 'గువ్వ గోరింక', 'అందం హిందోళం' పాటల రీమేక్లు సందడి చేశాయి. ఇప్పుడు 1990లో చిరంజీవి నటించిన 'కొండవీటి దొంగ' చిత్రంలోని ఓ సూపర్ హిట్ పాటను ధరమ్ తేజ్ చిత్రంలో రీమేక్ చేయనున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. 'జవాన్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ధరమ్ తేజ్ ప్రస్తుతం వి.వి. వినాయక్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇందులో 'చమకు చమకు ఛాం..' పాటను రీమేక్ చేయనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ సినిమాలో ధరమ్ తేజ్కు జోడీగా లావణ్య త్రిపాఠి నటిస్తున్నారు. సి.కల్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 2018 ఫిబ్రవరి 9న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- గల్ఫ్ ఎయిర్ టేకాఫ్ సేల్..తక్కవ ధరలకే 150,000 టిక్కెట్లు..!!
- సులైబిఖాట్ బీచ్లో ఫోటోగ్రాఫర్లపై ఆంక్షలు..!!
- ట్రావెల్ అండ్ టూరిజం సంస్థకు OMR15,815 ఫైన్..!!
- అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు..మార్చిలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా?
- డిజిటల్ ఆడిటర్ కార్డును ప్రారంభించిన ఖతార్..!!
- "చెక్ యువర్ హెల్త్" క్యాంపెయిన్..నిమిషాల్లో 10 పరీక్షలు..!!
- భారత్కు ట్రంప్ షాక్..
- లండన్లో అగ్నిప్రమాదం..తెలుగు యువకుడు మృతి
- ఉద్యోగాలకు దరఖాస్తు గడువు నేటితో ముగింపు!
- టైటానియం, రేర్ ఎర్త్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్కు కొత్త దిశ: మంత్రి కొల్లు రవీంద్ర









