ఉగ్రవాదంపై పోరాడుతున్నాం.. పాకిస్తాన్
- January 01, 2018
డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై పాక్ అలర్టయ్యింది. ఉగ్రవాదులపై తాము పోరాటం చేస్తూనే ఉన్నామని పాకిస్థాన్ విదేశాంగశాఖ మంత్రి ఖవాజా అసిఫ్ చెప్పుకొచ్చారు. ట్రంప్ ట్వీట్ చేసిన నిమిషాల వ్యవధిలోనే అసిఫ్ దీనిపై ట్వీట్ చేశారు. వీలైనంత త్వరలోనే ట్రంప్ వ్యాఖ్యలపై స్పందిస్తామని... నిజాలు, అవాస్తవాలకు మధ్య ఉన్న తేడా ఏమిటో ప్రపంచం త్వరలోనే తెలుసుకుంటుందని అసిఫ్ తన ట్వీట్లో పేర్కొన్నారు. ఐతే.. తాజాగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో పాక్కు భారీ షాక్ తగిలింది. గతంలో కూడా పాక్ ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందని ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. మరోసారి అవే వ్యాఖ్యలను ఆయన పునరుద్ఘాటించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







