డ్రైవింగ్ టెస్ట్ కోసం లంచం: మహిళకు జైలు
- January 15, 2018
అరబ్ మహిళ ఒకరు, 500 దిర్హామ్లతోపాటు, చాక్లెట్లు ఇచ్చి డ్రైవింగ్ టెస్ట్ పాస్ అయ్యేందుకు ప్రయత్నించగా, ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయస్థానం ఆమెకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అలాగే 5000 దిర్హామ్ల జరీమానా, డిపోర్టేషన్ కూడా ఆమెకు వర్తిస్తుంది. ఏడుసార్లు ఆ మహిళ డ్రైవింగ్ టెస్ట్ ఫెయిల్ అవడంతో, ఓ మహిళా ఉద్యోగికి లంచం ఇచ్చి టెస్ట్ పాస్ అవ్వాలనుకుంది. లంచం విషయమై మహిళా అధికారి, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగు చూసింది. అయితే విచారణలో నిందితురాలు, బహుమతిగా మాత్రమే వాటిని ఇచ్చాననీ, అందుకు ప్రతిఫలంగా తాను ఏమీ కోరలేదని పేర్కొంది. తాను అన్యాయంగా ఈ కేసులో ఇరికింపబడ్డానని నిందితురాలు బుకాయించినా, న్యాయస్థానం మాత్రం ఆమె వాదనను తోసిపుచ్చి, ఆమెను ఈ కేసులో దోషిగా నిర్ధారించింది.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







