డ్రైవింగ్ టెస్ట్ కోసం లంచం: మహిళకు జైలు
- January 15, 2018
అరబ్ మహిళ ఒకరు, 500 దిర్హామ్లతోపాటు, చాక్లెట్లు ఇచ్చి డ్రైవింగ్ టెస్ట్ పాస్ అయ్యేందుకు ప్రయత్నించగా, ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయస్థానం ఆమెకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అలాగే 5000 దిర్హామ్ల జరీమానా, డిపోర్టేషన్ కూడా ఆమెకు వర్తిస్తుంది. ఏడుసార్లు ఆ మహిళ డ్రైవింగ్ టెస్ట్ ఫెయిల్ అవడంతో, ఓ మహిళా ఉద్యోగికి లంచం ఇచ్చి టెస్ట్ పాస్ అవ్వాలనుకుంది. లంచం విషయమై మహిళా అధికారి, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగు చూసింది. అయితే విచారణలో నిందితురాలు, బహుమతిగా మాత్రమే వాటిని ఇచ్చాననీ, అందుకు ప్రతిఫలంగా తాను ఏమీ కోరలేదని పేర్కొంది. తాను అన్యాయంగా ఈ కేసులో ఇరికింపబడ్డానని నిందితురాలు బుకాయించినా, న్యాయస్థానం మాత్రం ఆమె వాదనను తోసిపుచ్చి, ఆమెను ఈ కేసులో దోషిగా నిర్ధారించింది.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









