డ్రైవింగ్ టెస్ట్ కోసం లంచం: మహిళకు జైలు
- January 15, 2018
అరబ్ మహిళ ఒకరు, 500 దిర్హామ్లతోపాటు, చాక్లెట్లు ఇచ్చి డ్రైవింగ్ టెస్ట్ పాస్ అయ్యేందుకు ప్రయత్నించగా, ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయస్థానం ఆమెకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అలాగే 5000 దిర్హామ్ల జరీమానా, డిపోర్టేషన్ కూడా ఆమెకు వర్తిస్తుంది. ఏడుసార్లు ఆ మహిళ డ్రైవింగ్ టెస్ట్ ఫెయిల్ అవడంతో, ఓ మహిళా ఉద్యోగికి లంచం ఇచ్చి టెస్ట్ పాస్ అవ్వాలనుకుంది. లంచం విషయమై మహిళా అధికారి, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగు చూసింది. అయితే విచారణలో నిందితురాలు, బహుమతిగా మాత్రమే వాటిని ఇచ్చాననీ, అందుకు ప్రతిఫలంగా తాను ఏమీ కోరలేదని పేర్కొంది. తాను అన్యాయంగా ఈ కేసులో ఇరికింపబడ్డానని నిందితురాలు బుకాయించినా, న్యాయస్థానం మాత్రం ఆమె వాదనను తోసిపుచ్చి, ఆమెను ఈ కేసులో దోషిగా నిర్ధారించింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









