భారత్ - ఇజ్రాయెల్ మధ్య 9 ఒప్పందాలు
- January 15, 2018భారత్ - ఇజ్రాయెల్ మధ్య 9 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. సైబర్ సహాకారం, శాస్త్ర సాంకేతికత సహకారం, ఇందన సహకారంతో పాటు పలు అంశాలపై ఒప్పందాలు జరిగాయి.
ఇజ్రాయెల్ ప్రధాని రాకతో కొత్త ఏడాది ప్రత్యేకంగా ప్రారంభమైందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. నిన్న, ఇవాళ ఇరుదేశాల అభివృద్ధిపై చర్చించుకున్నాం. 120 కోట్ల మంది భారతీయుల తరపున ఇజ్రాయెల్ ప్రజలకు శుభాకాంక్షలు. గతంలో తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికే సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతం దిశగా చర్చలు సాగాయి. రక్షణ రంగంలోనూ పెట్టుబడులకు ఇజ్రయెల్ను ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు.
నిన్న జరిగిన సమావేశంలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. భారత్లో అపూర్వ స్వాగతం లభించింది. భారత్లో లభించిన ఆదరణ ఇజ్రాయెల్కు దక్కిన అపూర్వ గౌరవంగా భావిస్తున్నాం. భారతీయులు గొప్ప పౌరులు, సహనశీలురు, ప్రజాస్వామ్యవాదులు. ఇజ్రాయెల్లో మోదీ పర్యటనతో ఇరుదేశాల మధ్య బంధం మరింత బలోపేతమైందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!