అగ్ని ప్రమాదంతో మల్కియాలో మాతమ్ ధ్వంసం
- January 15, 2018
మనామా: అగ్ని ప్రమాదం కారణంగా మాతమ్ (కమ్యూనిటీ మరియు రెలిజియస్ సెంటర్) ధ్వంసమైన ఘటన నార్తరన్ గవర్నరేట్ పరిధిలో జరిగింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం కలగలేదు. ఇంటీరియర్ మినిస్ట్రీ వెల్లడించిన వివరాల ప్రకారం మల్కియా విలేజ్లో ఈ ప్రమాదం చోటు చేసుకుందనీ, తెల్లవారుఝామున 1.15 నిమిషాల సమయంలో అగ్ని ప్రమాదం జరిగిందనీ, ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ ఈ ప్రమాదానికి కారణమని తెలియవస్తోంది. సివిల్ డిఫెన్స్ డైరెక్టరేట్, సకాలంలో స్పందించి అగ్ని కీలల్ని ఆర్పివేశాయి. ఇస్లామిక్ ఎఫైర్స్ అండ్ ఎండోవ్మెంట్స్ మినిస్ట్రీ - జఫ్ఫారియా వక్ఫ్ డైరెక్టరేట్ (జెడబ్ల్యుడి) - జస్టిస్ ఈ ఘటనను ధృవీకరించింది. మాటమ్స్ మరియు రెలిజియస్ సెంటర్స్ - జఫ్ఫారీ సెక్షన్కి సంబంధించి జెడబ్ల్యుడి అధీకృత సంస్థ. జెడబ్ల్యుడి ప్రెసిడెంట్ షేక్ మొహ్సెన్ అల్ అస్ఫూర్, సంఘటనా స్థలాన్ని సందర్శించారు. తక్షణం ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నివేదిక తనకు అందజేయాలని ఆయన సంబంధిత అధికారుల్ని ఆదేశించారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







