అగ్ని ప్రమాదంతో మల్కియాలో మాతమ్ ధ్వంసం
- January 15, 2018
మనామా: అగ్ని ప్రమాదం కారణంగా మాతమ్ (కమ్యూనిటీ మరియు రెలిజియస్ సెంటర్) ధ్వంసమైన ఘటన నార్తరన్ గవర్నరేట్ పరిధిలో జరిగింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం కలగలేదు. ఇంటీరియర్ మినిస్ట్రీ వెల్లడించిన వివరాల ప్రకారం మల్కియా విలేజ్లో ఈ ప్రమాదం చోటు చేసుకుందనీ, తెల్లవారుఝామున 1.15 నిమిషాల సమయంలో అగ్ని ప్రమాదం జరిగిందనీ, ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ ఈ ప్రమాదానికి కారణమని తెలియవస్తోంది. సివిల్ డిఫెన్స్ డైరెక్టరేట్, సకాలంలో స్పందించి అగ్ని కీలల్ని ఆర్పివేశాయి. ఇస్లామిక్ ఎఫైర్స్ అండ్ ఎండోవ్మెంట్స్ మినిస్ట్రీ - జఫ్ఫారియా వక్ఫ్ డైరెక్టరేట్ (జెడబ్ల్యుడి) - జస్టిస్ ఈ ఘటనను ధృవీకరించింది. మాటమ్స్ మరియు రెలిజియస్ సెంటర్స్ - జఫ్ఫారీ సెక్షన్కి సంబంధించి జెడబ్ల్యుడి అధీకృత సంస్థ. జెడబ్ల్యుడి ప్రెసిడెంట్ షేక్ మొహ్సెన్ అల్ అస్ఫూర్, సంఘటనా స్థలాన్ని సందర్శించారు. తక్షణం ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నివేదిక తనకు అందజేయాలని ఆయన సంబంధిత అధికారుల్ని ఆదేశించారు.
తాజా వార్తలు
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!







