అగ్ని ప్రమాదంతో మల్కియాలో మాతమ్ ధ్వంసం
- January 15, 2018
మనామా: అగ్ని ప్రమాదం కారణంగా మాతమ్ (కమ్యూనిటీ మరియు రెలిజియస్ సెంటర్) ధ్వంసమైన ఘటన నార్తరన్ గవర్నరేట్ పరిధిలో జరిగింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం కలగలేదు. ఇంటీరియర్ మినిస్ట్రీ వెల్లడించిన వివరాల ప్రకారం మల్కియా విలేజ్లో ఈ ప్రమాదం చోటు చేసుకుందనీ, తెల్లవారుఝామున 1.15 నిమిషాల సమయంలో అగ్ని ప్రమాదం జరిగిందనీ, ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ ఈ ప్రమాదానికి కారణమని తెలియవస్తోంది. సివిల్ డిఫెన్స్ డైరెక్టరేట్, సకాలంలో స్పందించి అగ్ని కీలల్ని ఆర్పివేశాయి. ఇస్లామిక్ ఎఫైర్స్ అండ్ ఎండోవ్మెంట్స్ మినిస్ట్రీ - జఫ్ఫారియా వక్ఫ్ డైరెక్టరేట్ (జెడబ్ల్యుడి) - జస్టిస్ ఈ ఘటనను ధృవీకరించింది. మాటమ్స్ మరియు రెలిజియస్ సెంటర్స్ - జఫ్ఫారీ సెక్షన్కి సంబంధించి జెడబ్ల్యుడి అధీకృత సంస్థ. జెడబ్ల్యుడి ప్రెసిడెంట్ షేక్ మొహ్సెన్ అల్ అస్ఫూర్, సంఘటనా స్థలాన్ని సందర్శించారు. తక్షణం ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నివేదిక తనకు అందజేయాలని ఆయన సంబంధిత అధికారుల్ని ఆదేశించారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









