6 గంటలు 102 పాటలు: 12 ఏళ్ళ చిన్నారి ఘనత
- January 26, 2018
సుచేతా సతీష్ అనే 12 ఏళ్ళ చిన్నారి కేవలం 6 గంటల్లోనే 102 పాటల్ని ఆలపించి అందరి చేతా ఔరా అన్పించుకుంది. భారత రిపబ్లిక్ దినోత్సవం నేపథ్యంలో ఇండియన్ కాన్సులేట్ ఆడిటోరియం - దుబాయ్లో జరిగిన కార్యక్రమంలో ఇండియన్ హైస్కూల్ స్టూడెంట్ సుచేతా సతీష్ తన ప్రతిభను చాటుకుంది. పలు రకాల భాషల్లో పాటల్ని ఆలపించడం, అది కూడా శ్రావ్యంగా ఆలపించడం గమనించదగ్గ అంశం. సాయంత్రం 4.10 నిమిషాలకు మొదలైన సుచేతా పాటల ప్రవాహం రాత్రి 10.30 నిమిషాల వరకు కొనసాగింది. ప్రస్తుతం ఏడో గ్రేడ్లో విద్యాభ్యాసం చేస్తోంది సుచేతా. అన్ని యూరోపియన్ లాంగ్వేజెస్, అలాగే భారతదేశానికి చెందిన 26 భాషలు, పలు సౌత్ అమెరికన్ లాంగ్వేజెస్, సౌత్ ఈస్ట్ ఏసియన్ లాంగ్వేజెస్లో ఆమె పాటలు పాడింది. పాటల్ని ఎంపిక చేసుకోవడం, గూగుల్ ట్రాన్స్లేటర్కి వెళ్ళి పాటల భావాన్ని అర్థం చేసుకోవడం, అలా ప్రాక్టీస్ చేయడం ద్వారా తన కుమార్తె ఈ ఘనతను సాధించినట్లు సుచేతా తండ్రి టి.సి సతీష్ చెప్పారు. కాన్సుల్ జనరల్ విపుల్ మాట్లాడుతూ, సుచేతా ప్రతిభ అనన్యసామాన్యమని కొనియాడారు. ఈవెంట్ కో-ఆర్డినేటర్ గిరీష్ పంత్ మాట్లాడుతూ, ఈ చిన్నారి ప్రతిభ మనందరికీ గర్వకారణమని అన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..









