ఫాన్స్ ని తీవ్రంగా హార్ట్ చేసిన మహేష్ బాబు
- January 26, 2018
డైరెక్టర్ కొరటాల శివ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో 'ఫస్ట్ ఓథ్' పేరిట వచ్చిన " భరత్ అనే నేను" సూపర్ స్టార్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ క్రమంలో సినిమాలో చెప్పిన డైలాగ్ తెలంగాణ మహేష్ బాబు అభిమానుల మనోభావాలను దెబ్బతీసింది అట. అసలు విషయానికొస్తే భరత్ అనే నేను సినిమా లో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా నటిస్తున్నారని మనకందరికీ తెలుసు.
అయితే సినిమాలో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి గా కనిపించడం తో తెలంగాణ ప్రాంతంలో ఉన్న అభిమానులకు మనసు నొచ్చుకుంది అట. రాష్ట్రం విడిపోయినా తరవాత అన్ని విషయాలలో భేదాభిప్రాయాలు వచ్చాయి కానీ సినిమా పరిశ్రమ విషయం వచ్చేటప్పటికి రెండు రాష్ట్రాల ప్రజలు తమ హీరోలను ప్రాంతీయపరంగా చూడకుండా తమ అభిమానాన్ని చాటుకున్నారు.
పైగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన చాలామంది సినిమా హీరోలకు తెలంగాణ రాష్ట్రంలో మంచి మార్కెట్ ఉంది. ఈ క్రమంలో మహేష్ బాబు తనను తాను ఆంధ్రప్రదేశ్ ప్రాంత వ్యక్తిగా చూపించుకోవడం తెలంగాణను కొంత కించపరిచినట్లు ఉంది అని చాలామంది అభిమానులు అంటున్నారు.
దర్శకుడు ఈ విషయంలో కొంత జాగ్రత్త తీసుకుంటే బాగుండేది అని టాక్ కూడా వినిపిస్తుంది. రెండు రాష్ట్రాలు కలిసి ఉండేట్లు లేక మరో పేరు ఏదైనా ఆలోచించాల్సింది. మరి సినిమాలో కనీసం ఇతర అభిమానులు ఫీల్ అవ్వకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నారో లేదో చూడాలి.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









