అనుమానిత డబ్బుని బదిలీ చేస్తున్న కేసులో నల్గురు నిందితులు అరెస్టు
- January 28, 2018
కువైట్ : ఏడు లక్షల అమెరికా డాలర్ల అనుమానిత డబ్బుని బదిలీ చేస్తున్న కేసులో నలుగురు ఈజిప్షియన్లు పోలీసులు దాడి చేసి అరెస్టు చేశారు. వారు అయిదు లక్షల అమెరికా డాలర్లను 730,000 కువైట్ దినార్లకు ఓ అనుమానితునికి విక్రయించడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు పొలిసు అధికారులు పేర్కొంటున్నారు. ఒక పౌరుడు ద్వారా ఒక ఈజిప్షియన్ స్నేహితుడి నుండి ప్రతి 5 లక్షల అమెరికా డాలర్లకు 730,000 కువైట్ దినార్లకు విక్రయించేందుకు అంగీకరించారు. వీరు మొత్తం 20 లక్షల అమెరికా డాలర్ల నగదు (నకిలీ కాదు) కొనడానికి ఆ పౌరుడు ఒక అవకాశాన్ని పొందాడు. అయితే ఆ నిజాయితీగల పౌరుడు ఫర్వానియా పోలీసు అధికారులకు వద్దకు వెళ్లి తనకు కొందరు ఇస్తున్న ఆఫర్ గురించి చెప్పాడు, ఒప్పందంలో భాగంగా వారికి సహకరిస్తున్నట్లు నటించమని పోలీసులు సూచించారు. కాగా ఆ పౌరుడు కోసం డాలర్లను రెండు బ్యాగ్ లతో జబ్రియాలో ఐదుగురు ఈజిప్షియన్లు నిరీక్షిస్తూ కనిపించారు. పోలీసులు అకస్మాతుగా వారి మధ్యలో రావడంతో అక్కడ రెడ్ హ్యాండ్ గా దొరికిన నలుగురిని అరెస్టు చేశారు, ఐదవ నిందితుడు అక్కడి నుంచి రెప్పపాటులో తప్పించుకున్నాడు. మిగిలిన డాలర్లు ఎక్కడ దాచి ఉంచారో తెలుసుకోవడానికి ఆ నల్గురు అనుమానితులు ప్రశ్నించబడుతున్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి