అనుమానిత డబ్బుని బదిలీ చేస్తున్న కేసులో నల్గురు నిందితులు అరెస్టు
- January 28, 2018
కువైట్ : ఏడు లక్షల అమెరికా డాలర్ల అనుమానిత డబ్బుని బదిలీ చేస్తున్న కేసులో నలుగురు ఈజిప్షియన్లు పోలీసులు దాడి చేసి అరెస్టు చేశారు. వారు అయిదు లక్షల అమెరికా డాలర్లను 730,000 కువైట్ దినార్లకు ఓ అనుమానితునికి విక్రయించడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు పొలిసు అధికారులు పేర్కొంటున్నారు. ఒక పౌరుడు ద్వారా ఒక ఈజిప్షియన్ స్నేహితుడి నుండి ప్రతి 5 లక్షల అమెరికా డాలర్లకు 730,000 కువైట్ దినార్లకు విక్రయించేందుకు అంగీకరించారు. వీరు మొత్తం 20 లక్షల అమెరికా డాలర్ల నగదు (నకిలీ కాదు) కొనడానికి ఆ పౌరుడు ఒక అవకాశాన్ని పొందాడు. అయితే ఆ నిజాయితీగల పౌరుడు ఫర్వానియా పోలీసు అధికారులకు వద్దకు వెళ్లి తనకు కొందరు ఇస్తున్న ఆఫర్ గురించి చెప్పాడు, ఒప్పందంలో భాగంగా వారికి సహకరిస్తున్నట్లు నటించమని పోలీసులు సూచించారు. కాగా ఆ పౌరుడు కోసం డాలర్లను రెండు బ్యాగ్ లతో జబ్రియాలో ఐదుగురు ఈజిప్షియన్లు నిరీక్షిస్తూ కనిపించారు. పోలీసులు అకస్మాతుగా వారి మధ్యలో రావడంతో అక్కడ రెడ్ హ్యాండ్ గా దొరికిన నలుగురిని అరెస్టు చేశారు, ఐదవ నిందితుడు అక్కడి నుంచి రెప్పపాటులో తప్పించుకున్నాడు. మిగిలిన డాలర్లు ఎక్కడ దాచి ఉంచారో తెలుసుకోవడానికి ఆ నల్గురు అనుమానితులు ప్రశ్నించబడుతున్నారు.
తాజా వార్తలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!







