U19 భారత్ జట్టుకు బీసీసీఐ భారీ నజరానా...!!
- February 03, 2018
భారత్ క్రికెట్ అండర్ 19 ప్రపంచ కప్ విశ్వ విజేతగా నిలిచింది. ఈ భారత యువ జట్టుకు బీసీసీఐ భారీ నజరాన ప్రకటించింది. న్యూజిలాండ్ వేదికగా జరిగిన ఈ ప్రపంచ కప్ టోర్నీలో భారత్ అ న్ని విభాగాల్లో రాణించి చక్కని ప్రతిభను కనబరిచి ప్రపంచ కప్ ను అందుకొన్నది. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయ సాధించింది. జట్టులోని ఒక్కొక్క సభ్యుడికి రూ.30 లక్షలు, కోచ్ రాహుల్ ద్రావిడ్ కు రూ. 50 లక్షలు, సహాయ సిబ్బందిలోని ఒక్కొక్కరికి రూ.20లక్షలు అందిస్తున్నట్లు బీసీసీఐ తన ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. సెమీఫైనల్ లో పాక్ పై భారత్ విజయం సాధించిన వెంటనే భారత యువ జట్టుకు నజరానా ఇస్తామని బీసీసీఐ తెలిపింది.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









