మాల్దీవుల్లో ఇద్దరు జర్నలిస్టుల అరెస్టు ఒకతను భారతీయదు ,ఇంకొకరు బ్రిటిష్ జాతీయుడు
- February 10, 2018
మాలే: అత్యవసర పరిస్థితి అమలవుతున్న నేపథ్యంలో దేశ భద్రత పేరు చెప్పి మాల్డీవుల్లో ఇద్దరు జర్నలిస్టులను అరెస్టు చేశారు. వారిలో ఒకతను భారతీ యుడు కాగా, మరొక తను భారత సంతతికి చెందిన బ్రిటిష్ జాతీయుడు. పంజాబ్కు చెందిన మణిశర్మ, లండన్కు చెందిన అతీష్ రావ్జీ పటేల్ 'ఏఎఫ్పి' న్యూస్ ఏజెన్సీకి రిపోర్టర్లుగా పని చేస్తున్నారు. జర్నలిస్టుల అరెస్టుపై జాయింట్ అపోజిషన్ అధికార ప్రతి నిధి అహ్మద్ మహ్లూఫ్ స్పందించారు.మాల్దీవుల్లో ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలిసిపోతుందని ప్రభుత్వం భయపడుతోందని అన్నారు. ఇక్కడ ఎంత మాత్రమూ పత్రికా స్వేచ్ఛ లేదని, గత రాత్రి ప్రముఖ టీవీ స్టేషన్లను మూసేశారని అధాలత్ పార్టీ డిప్యూటీ లీడర్ అలీ జహీర్ అ న్నారు. మాల్దీవుల్లో ఇద్దరు విదేశీ జర్నలిస్టులను అరెస్టు చేశారని, వారి లో ఒకతను భారతీయుడు కాగా, మరొకతను బ్రిటిష్ అని, వారు ఎఎఫ్పి ఉద్యోగులని విదేశీ వ్యవహారాల మాజీ మంత్రి అబ్దుల్లా షాహిద్ అన్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







