పాక్ లో 'అయ్యారి' మూవీ నిషేథం

- February 16, 2018 , by Maagulf
పాక్ లో 'అయ్యారి' మూవీ నిషేథం

బాలీవుడ్ మూవీలు సాధారణంగా పాకిస్థాన్ లో విడుదలవుతుంటాయి.. ఎన్నో వివాదాలకు నెలవైన పద్మావత్ మూవీ సైతం అక్కడ విడుదలైంది.. అయితే రుతుక్రమ అంశంతో రూపొందిన ప్యాడ్ మ్యాన్ మూవీ ని అక్కడ నిషేధించారు.. తాజాగా మరో మూవీకి కూడా అక్కడ సెన్సార్ అడ్డుపుల్ల వేసింది.. అదే సిద్ధార్ధ్ మల్హాత్రా, మనోజ్ బాజ్ పాయ్, రకుల్ ప్రీత్ సింగ్ లు నటించిన అయ్యారి.. ఈ మూవీలో భారత్ ఆర్మిని ఎంతో శక్తివంతంగా చూపారట.. దీంతో ఈ మూవీపై అక్కడ నిషేధం విధించారు. ఇక ఈ అయ్యారి మూవీకి నీరజ్ పాండే దర్శకుడు.. ఇప్పటికీ ఈ దర్శకుడు బేబీ, నామ్ షబానా మూవీలు తీశాడు.. ఈ మూవీల్లో దేశభక్తిని ప్రస్తావించాడు.. ఈ రెండు మూవీలు కూడా పాక్ లో విడుదలకు నోచుకోలేదు..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com