ప్రముఖ హాస్యనటుడు గుండు హనుమంతరావు మృతి..
- February 18, 2018
సినీ హాస్యనటుడు గుండు హనుమంతరావు 61 మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న హనుమంతరావు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. అక్టోబర్ 10 , 1956 విజయవాడలో జన్మించిన అయన సుమారు 400 పైచిలుకు చిత్రాల్లో నటించారు. హనుమంతరావు సినిమాల్లోకి రాకముందు మిఠాయి వ్యాపారం చేసేవారూ. ఆ తరువాత 18 ఏళ్ల వయసులో "రావణబ్రహ్మ" నాటకంలో తన నట విశ్వరూపాన్ని చూపించారు. అనంతరం రాజేంద్ర ప్రసాద్ నటించిన "అహనా నా పెళ్ళంటా" చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. రాజేంద్రప్రసాద్ తో యమలీల , కొబ్బరిబోండం, రాజేంద్రుడు గజేంద్రుడు , వంటి హిట్ చిత్రాల్లో నటించి సినీ ప్రరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే బుల్లితెర సంచలన కామెడీ సీరియల్ "అమృతంలో" ఆంజనేయులుగా నటించారు. కాగా గుండు హనుమంతరావు మరణంతో సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి