ప్రముఖ హాస్యనటుడు గుండు హనుమంతరావు మృతి..
- February 18, 2018సినీ హాస్యనటుడు గుండు హనుమంతరావు 61 మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న హనుమంతరావు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. అక్టోబర్ 10 , 1956 విజయవాడలో జన్మించిన అయన సుమారు 400 పైచిలుకు చిత్రాల్లో నటించారు. హనుమంతరావు సినిమాల్లోకి రాకముందు మిఠాయి వ్యాపారం చేసేవారూ. ఆ తరువాత 18 ఏళ్ల వయసులో "రావణబ్రహ్మ" నాటకంలో తన నట విశ్వరూపాన్ని చూపించారు. అనంతరం రాజేంద్ర ప్రసాద్ నటించిన "అహనా నా పెళ్ళంటా" చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. రాజేంద్రప్రసాద్ తో యమలీల , కొబ్బరిబోండం, రాజేంద్రుడు గజేంద్రుడు , వంటి హిట్ చిత్రాల్లో నటించి సినీ ప్రరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే బుల్లితెర సంచలన కామెడీ సీరియల్ "అమృతంలో" ఆంజనేయులుగా నటించారు. కాగా గుండు హనుమంతరావు మరణంతో సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
తాజా వార్తలు
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి