ప్రముఖ హాస్యనటుడు గుండు హనుమంతరావు మృతి..
- February 18, 2018
సినీ హాస్యనటుడు గుండు హనుమంతరావు 61 మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న హనుమంతరావు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. అక్టోబర్ 10 , 1956 విజయవాడలో జన్మించిన అయన సుమారు 400 పైచిలుకు చిత్రాల్లో నటించారు. హనుమంతరావు సినిమాల్లోకి రాకముందు మిఠాయి వ్యాపారం చేసేవారూ. ఆ తరువాత 18 ఏళ్ల వయసులో "రావణబ్రహ్మ" నాటకంలో తన నట విశ్వరూపాన్ని చూపించారు. అనంతరం రాజేంద్ర ప్రసాద్ నటించిన "అహనా నా పెళ్ళంటా" చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. రాజేంద్రప్రసాద్ తో యమలీల , కొబ్బరిబోండం, రాజేంద్రుడు గజేంద్రుడు , వంటి హిట్ చిత్రాల్లో నటించి సినీ ప్రరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే బుల్లితెర సంచలన కామెడీ సీరియల్ "అమృతంలో" ఆంజనేయులుగా నటించారు. కాగా గుండు హనుమంతరావు మరణంతో సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









