అలనాటి అతిలోక సుందరి ఇక లేరు
- February 24, 2018
దుబాయ్:బాలీవుడ్ నటుడు మొహితా మార్వా వివాహం కోసం యుఎఇలోని రాస్ అల్ కైమా వెళ్లిన నటి శ్రీదేవి శనివారం రాత్రి 11 నుంచి 11.30 గంటల మధ్య తుదిశ్వాస విడిచినట్లు తెలిసింది. శ్రీదేవి మరణవార్త తెలిసిన వెంటనే ముంబై నుంచి దుబాయ్ బయలుదేరిన ఆమె మరిది సంజయ్ కపూర్ ఈ విషయం చెప్పారు.
తమ అభిమాన నటి శ్రీదేవి ఇక లేరని తెలియగానే సినిమా రంగంతో పాటు, ఆమె అభిమానులంతా తీవ్ర విషాదానికి లోనయ్యారు. కేవలం 54 ఏళ్ళ వయసులోనే ఆమె దూరం కావడం జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియాలో తమ సంతాపాన్ని తెలియజేస్తూ శ్రీదేవితో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు.
భారత సినిమా రంగంలోని నటీమణుల్లో తొలిసారి సూపర్ స్టార్ హోదా దక్కించుకున్న హీరోయిన్ శ్రీదేవి. మరీ ముఖ్యంగా దక్షిణాది నుంచి వెళ్ళి బాలీవుడ్ను ఏలిన ఘనతను శ్రీదేవి దక్కించుకున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









