జిమ్నాస్టిక్ ప్రపంచకప్లో తెలుగమ్మాయి రికార్డు
- February 24, 2018
మెల్బోర్న్: రెండేళ్ల క్రితం వరకు ఈ పేరు పెద్దగా పరిచయంలేని ఆట. 2016లొ జరిగిన రియో ఒలింపిక్స్్లో దీపా కర్మాకర్ భారత దేశం తరుపున ఈపోటీల్లో పాల్గొంది. ఫైనల్లో తృటిలో పతకాన్ని కోల్పోయినా దీప దేశానికే ఈ క్రీడను మరోసారి పరిచయం చేసింది. సుమారు 52ఏళ్ల తర్వాత జిమ్నాస్టిక్స్ విభాగంలో దేశం తరుపున ప్రాతినిధ్యం వహించిన మహిళగా రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా..తాజాగా ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జిమ్నాస్టిక్ ప్రపంచకప్ పోటీలు జరుగుతున్నాయి.
ఈ పోటీల్లో భారత్కు చెందిన అరుణ రెడ్డి కాంస్య పతకం గెలిచింది. జిమ్నాస్టిక్ ప్రపంచకప్ 2018లో భారత్ తరుపున ప్రాతినిథ్యం వహిస్తున్న హైదరాబాద్ జిమ్నాస్ట్ బుద్దా అరుణ రెడ్డి సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంది. శనివారం జరిగిన టోర్నీ ఫైనల్లో అరుణ 13,469 పాయింట్లతో వాల్ట్లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన క్వాలిఫయింగ్ రెండ్లో ఫ్లోర్, వాల్ట్ ఈవెంట్స్లో 11,466 పాయింట్లు సాధించి ఫైనల్కు చేరిన అరుణ.తుదిపోరులో అద్భుత ప్రదర్శతో మెరిసింది. మెల్బోర్న్లో జరుగుతున్న ఈ ప్రపంచకప్కి మొత్తం 16దేశాల నుంచి అథ్లెట్స్ ప్రాతినిథ్యం వహించగా.గత రెండు రోజుల నుంచి క్వాలిఫయింగ్ రౌండ్స్ జరిగాయి. వాల్ట్ క్వాలిఫయింగ్లో 13,566 పాయింట్లతో రెండో స్థానం దక్కించుకున్న అరుణ.
శుక్రవారం చివరి స్థానం (8వ స్థానం)లో ఫైనల్కు ప్రవేశించి కాంస్య పతకం చేజిక్కించుకోవడం విశేషం. స్లొవేకియాకు చెందిన జస కిస్లెఫ్ (13,800) స్వర్ణం గెలుచుకోగా.ఆస్ట్రేలియాకు చెందిన ఎమిలి వైట్ హెడ్ (13,699) రజతం దక్కించుకుంది. ఇదే ఈవెంట్లో మరో భారత అమ్మాయి ప్రణతి నాయక్ (13,416) ఆరో స్థానంలో నిలిచారు. జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్లో భారత్ తరుపున పతకం గెలిచిన తొలి మహిళగా 22 ఏళ్ల అరుణ చరిత్ర సృష్టించింది. అరుణ హైదరాబాద్కు చెందిన అమ్యాయి. కరాటేలో అరుణ బ్లాక్బెల్ట్ సాధించింది. అంతేకాదు గతంలో ఆమె కరాటే శిక్షకురాలిగా కూడా పనిచేశారు. 2014 కామన్వెల్త్ గేమ్స్లో అరుణ అర్హత పోటీల్లో 14వ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఆసియా గేమ్స్లో 9వ స్థానంలో నిలిచిన మన తెలుగమ్యా యి.2017లో ఆసియా ఛాంపియన్షిప్లో ఆరో స్థానంతో సరిపెట్టుకుంది.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









