అక్రమ మైనింగ్‌: 3 మిలియన్‌ ఒమన్‌ రియాల్స్‌ జరీమానా

- March 06, 2018 , by Maagulf
అక్రమ మైనింగ్‌: 3 మిలియన్‌ ఒమన్‌ రియాల్స్‌ జరీమానా

మస్కట్‌: ఒమన్‌లో ఏడు కంపెనీలపై 3 మిలియన్‌ ఒమన్‌ రియాల్స్‌ జరీమానా విధించారు. అక్రమ మైనింగ్‌కి పాల్పడుతున్న నేరానికిగాను ఈ జరీమానాను విధించినట్లు పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ మైనింగ్‌ పేర్కొంది. 1.5 మిలియన్‌ ఒమన్‌ రియాల్స్‌ విలువైన అక్రమ మైనింగ్‌కి పాల్పడినట్లుగా లెక్క కట్టారు. 60 రోజుల్లోగా ఏడు కంపెనీలు సెటిల్‌వమెంట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఏడు కంపెనీలను పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌కి రిఫర్‌ చేయడం జరిగింది.184,000 ఒమన్‌ రియాల్స్‌ ఇప్పటికే ఉల్లంఘనల నేపథ్యంలో రికవరీ చేయడం జరిగిందనీ, మిగతా మొత్తానికి సంబంధించి అథారిటీస్‌ ఇన్వెస్టిగేషన్‌ చేస్తున్నాయనీ తెలుస్తోంది. కంపెనీలు సేల్స్‌ రిపోర్ట్స్‌ని, మిగతా డాక్యుమెంట్స్‌ని సమర్పించాల్సి ఉంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com