దుబాయ్ డ్యూటీ ఫ్రీ: 1 మిలియన్ డాలర్స్ గెల్చుకున్న ఇండియన్
- March 06, 2018
కేరళకు చెందిన వ్యాపారవేత్త, దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ ప్రమోషన్ ఆన్లైన్ టిక్కెట్ ద్వారా 1 మిలియన్ డాలర్స్ గెల్చుకున్నారు. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద జరిగిన డ్రాలో ఆయన గెలుపొందారు. 40 ఏళ్ళ ప్రాబిన్ థామస్, భారతదేశానికి చెందిన వ్యక్తి. నెట్వర్కింగ్ బిజినెస్ నిర్వహిస్తోన్న ఆయన, కేరళలో ఐటీ ప్రోడక్ట్స్ని విక్రయిస్తుంటారు. 265 సిరీస్లోని 0471 టిక్కెట్పై ఆయనకు ఈ బంపర్ ప్రైజ్ తగిలింది. రెగ్యులర్గా లోకల్ లాటరీ టిక్కెట్లను కొనుగోలు చేసే థామస్, ఇంతకుముందెన్నడూ ఇలాంటి బహుమతి గెల్చుకోలేదు. 1 మిలియన్ డాలర్స్ గెల్చుకున్న థామస్ని, ఈ సొమ్ముతో ఏం చేస్తారు? అనడిగితే, తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన దుబాయ్ డ్యూటీ ఫ్రీకి థ్యాంక్స్ చెప్పారు. దుబాయ్లోనే నివసిస్తోన్న ఇంకో ఇండియన్ అఫ్జాన్ జిల్లా, బిఎండబ్ల్యు ఆర్ 9 టి అర్బన్ జిఎస్ అనే ఖరీదైన బైక్ని సొంతం చేసుకున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







