దుబాయ్ డ్యూటీ ఫ్రీ: 1 మిలియన్ డాలర్స్ గెల్చుకున్న ఇండియన్
- March 06, 2018
కేరళకు చెందిన వ్యాపారవేత్త, దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ ప్రమోషన్ ఆన్లైన్ టిక్కెట్ ద్వారా 1 మిలియన్ డాలర్స్ గెల్చుకున్నారు. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద జరిగిన డ్రాలో ఆయన గెలుపొందారు. 40 ఏళ్ళ ప్రాబిన్ థామస్, భారతదేశానికి చెందిన వ్యక్తి. నెట్వర్కింగ్ బిజినెస్ నిర్వహిస్తోన్న ఆయన, కేరళలో ఐటీ ప్రోడక్ట్స్ని విక్రయిస్తుంటారు. 265 సిరీస్లోని 0471 టిక్కెట్పై ఆయనకు ఈ బంపర్ ప్రైజ్ తగిలింది. రెగ్యులర్గా లోకల్ లాటరీ టిక్కెట్లను కొనుగోలు చేసే థామస్, ఇంతకుముందెన్నడూ ఇలాంటి బహుమతి గెల్చుకోలేదు. 1 మిలియన్ డాలర్స్ గెల్చుకున్న థామస్ని, ఈ సొమ్ముతో ఏం చేస్తారు? అనడిగితే, తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన దుబాయ్ డ్యూటీ ఫ్రీకి థ్యాంక్స్ చెప్పారు. దుబాయ్లోనే నివసిస్తోన్న ఇంకో ఇండియన్ అఫ్జాన్ జిల్లా, బిఎండబ్ల్యు ఆర్ 9 టి అర్బన్ జిఎస్ అనే ఖరీదైన బైక్ని సొంతం చేసుకున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









