దుబాయ్ డ్యూటీ ఫ్రీ: 1 మిలియన్ డాలర్స్ గెల్చుకున్న ఇండియన్
- March 06, 2018
కేరళకు చెందిన వ్యాపారవేత్త, దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ ప్రమోషన్ ఆన్లైన్ టిక్కెట్ ద్వారా 1 మిలియన్ డాలర్స్ గెల్చుకున్నారు. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద జరిగిన డ్రాలో ఆయన గెలుపొందారు. 40 ఏళ్ళ ప్రాబిన్ థామస్, భారతదేశానికి చెందిన వ్యక్తి. నెట్వర్కింగ్ బిజినెస్ నిర్వహిస్తోన్న ఆయన, కేరళలో ఐటీ ప్రోడక్ట్స్ని విక్రయిస్తుంటారు. 265 సిరీస్లోని 0471 టిక్కెట్పై ఆయనకు ఈ బంపర్ ప్రైజ్ తగిలింది. రెగ్యులర్గా లోకల్ లాటరీ టిక్కెట్లను కొనుగోలు చేసే థామస్, ఇంతకుముందెన్నడూ ఇలాంటి బహుమతి గెల్చుకోలేదు. 1 మిలియన్ డాలర్స్ గెల్చుకున్న థామస్ని, ఈ సొమ్ముతో ఏం చేస్తారు? అనడిగితే, తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన దుబాయ్ డ్యూటీ ఫ్రీకి థ్యాంక్స్ చెప్పారు. దుబాయ్లోనే నివసిస్తోన్న ఇంకో ఇండియన్ అఫ్జాన్ జిల్లా, బిఎండబ్ల్యు ఆర్ 9 టి అర్బన్ జిఎస్ అనే ఖరీదైన బైక్ని సొంతం చేసుకున్నారు.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







