దుబాయ్ డ్యూటీ ఫ్రీ: 1 మిలియన్ డాలర్స్ గెల్చుకున్న ఇండియన్
- March 06, 2018
కేరళకు చెందిన వ్యాపారవేత్త, దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ ప్రమోషన్ ఆన్లైన్ టిక్కెట్ ద్వారా 1 మిలియన్ డాలర్స్ గెల్చుకున్నారు. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద జరిగిన డ్రాలో ఆయన గెలుపొందారు. 40 ఏళ్ళ ప్రాబిన్ థామస్, భారతదేశానికి చెందిన వ్యక్తి. నెట్వర్కింగ్ బిజినెస్ నిర్వహిస్తోన్న ఆయన, కేరళలో ఐటీ ప్రోడక్ట్స్ని విక్రయిస్తుంటారు. 265 సిరీస్లోని 0471 టిక్కెట్పై ఆయనకు ఈ బంపర్ ప్రైజ్ తగిలింది. రెగ్యులర్గా లోకల్ లాటరీ టిక్కెట్లను కొనుగోలు చేసే థామస్, ఇంతకుముందెన్నడూ ఇలాంటి బహుమతి గెల్చుకోలేదు. 1 మిలియన్ డాలర్స్ గెల్చుకున్న థామస్ని, ఈ సొమ్ముతో ఏం చేస్తారు? అనడిగితే, తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన దుబాయ్ డ్యూటీ ఫ్రీకి థ్యాంక్స్ చెప్పారు. దుబాయ్లోనే నివసిస్తోన్న ఇంకో ఇండియన్ అఫ్జాన్ జిల్లా, బిఎండబ్ల్యు ఆర్ 9 టి అర్బన్ జిఎస్ అనే ఖరీదైన బైక్ని సొంతం చేసుకున్నారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







