షార్జాలో కారు ప్రమాదం: వ్యక్తి మృతి
- March 09, 2018
షార్జా:షార్జాలోని షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్డుపై తస్జీల్ విలేజ్ వద్ద జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందారు. కారు సాంకేతిక లోపంతో ఆగిపోవడంతో, రోడ్డు మధ్యలో వాహనాన్ని ఆ వ్యక్తి నిలిపివేయగా, అదే మార్గంలో వేగంగా వచ్చిన మరో వాహనం, ఆ కారుని ఢీకొంది. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పోలీస్ పెట్రోల్స్ అక్కడికి చేరుకుని, మృతదేహాన్ని అక్కడినుంచి తరలించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ - షార్జా పోలీస్, వాహనదారులు తమ వాహనాల్ని రోడ్డుపై ప్రత్యేక పరిస్థితుల్లో నిలిపివేయాల్సి వచ్చినప్పుడు అప్రమత్తంగా వుండాలని హెచ్చరించారు. ఎమర్జన్సీ సమయాల్లో 'యీల్డ్' సిగ్నల్ వినియోగించాలని సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!







