ప్రకాశం జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా..
- November 29, 2015
ప్రకాశం జిల్లాలో జాతీయ రహదారిపై ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ సమీపంలో సోమవారం ఉదయం పాఠశాల బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్కు తీవ్ర గాయాలు కాగా, బస్సులో ఉన్న 40 మంది విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఒంగోలు రైల్వేస్టేషన్ సమీపంలోని సెయింట్ మేరీస్ పాఠశాల బస్సు త్రోవగుంట వైపు నుంచి ఒంగోలు వస్తుండగా లారీ వేగంగా దూసుకొచ్చి ఢీకొట్టింది. దీంతో బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. సమాచారం అందుకున్న తాలూకా పోలీస్స్టేషన్ ఎస్సై ఆంటోనీ రాజ్ ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. తీవ్రంగా గాయపడి బస్సులోనే ఇరుకుపోయిన డ్రైవర్ను సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







