ప్రకాశం జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా..

- November 29, 2015 , by Maagulf
ప్రకాశం జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా..

ప్రకాశం జిల్లాలో జాతీయ రహదారిపై ఒంగోలు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ సమీపంలో సోమవారం ఉదయం పాఠశాల బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా, బస్సులో ఉన్న 40 మంది విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఒంగోలు రైల్వేస్టేషన్‌ సమీపంలోని సెయింట్‌ మేరీస్‌ పాఠశాల బస్సు త్రోవగుంట వైపు నుంచి ఒంగోలు వస్తుండగా లారీ వేగంగా దూసుకొచ్చి ఢీకొట్టింది. దీంతో బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. సమాచారం అందుకున్న తాలూకా పోలీస్‌స్టేషన్‌ ఎస్సై ఆంటోనీ రాజ్‌ ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. తీవ్రంగా గాయపడి బస్సులోనే ఇరుకుపోయిన డ్రైవర్‌ను సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com