జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న 'దుబాయ్ పవనిజం' కార్యకర్తలు

- March 15, 2018 , by Maagulf

కాజా:గుంటూరు జిల్లా కాజాలో నిర్వహించిన జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా కార్యకర్తలు మోహరించారు.జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఎటువంటి సమస్య వచ్చినా తను ముందు ఉంటానని తెలియజేశారు.

ఈ కార్యక్రమములో దుబాయ్ పవనిజం కార్యకర్తలు రవి చల్లా,బాలాజీ గరగా,ప్రసాద్ మంచి నీళ్లు,మజ్జిక ప్యాకెట్లు సరఫరాచేశారు. బహిరంగ సభ అనంతరం పవన్ కళ్యాణ్ దుబాయ్ నుంచి విచ్చేసిన కార్యకర్తలతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో గల్ఫ్ లోని సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com