టర్కీ కావాలనే రష్యా యుద్ద విమానం కూల్చి వేసింది--పుతిన్
- December 01, 2015
టర్కీ చేయాల్సిందంతా చేసి ఇప్పుడు నాటకాలు ఆడుతున్నదని రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ మండిపడ్డారు. టర్కీ కావాలనే తమ యుద్ద విమానం కూల్చి వేసిందని, వారు చేసిన పనికి తగిన మూల్యం చెల్లించుకుంటారని ఆయన హెచ్చరించారు. ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్)తో సంబంధాలు దెబ్బతింటాయనే ఉద్దేశంతోనే టర్కీ తమ యుద్ద విమానాన్ని టార్గెట్ చేసుకునిందని ఆరోపించారు. ప్యారిస్ లో జరుగుతున్న ప్రపంచ వాతావరణ సదస్సుకు హాజరైన వ్లదిమిర్ పుతిన్ తరువాత మీడియాతో మాట్లాడారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల దగ్గర నుంచి ఆయిల్ దిగుమతి చేసుకునే విషయంలో ఇబ్బందులు ఎదురౌతాయనే ఉద్దేశంతోనే తమ యుద్ద విమానాన్ని టార్గెట్ చేసుకుని కూల్చేశారని, తరువాత ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల దగ్గర సానుభూతి సంపాదించారని ఆయన ఆరోపించారు. టర్కీ భూ భాగంలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు చెందిన ఆయిల్ పైప్ లైన్ ఉందని ఇదే సందర్బంలో గుర్తు చేశారు. ఈ ఆయిల్ పైప్ లైన్ ఇస్లామిక్ స్టేట్ మాత్రమే నిర్వహిస్తుందని వ్లదిమిర్ పుతిన్ చెప్పారు. ఆ పైప్ లైన్ ను తాము ఎక్కడ ద్వంసం చేస్తామో అని భయంతో తమ యుద్ద విమానాన్ని కూల్చి వేశారని ఆరోపించారు. కనీసం హెచ్చరికలు కూడా చెయ్యకుండా ఈ దారుణానికి పాల్పడ్డారని విమర్శించారు. తమ యుద్ద విమానాన్ని టర్కీ కూల్చి వేసిందని తాము అనవసరంగా విమర్శించలేదని, తాము చేస్తున్న ఆరోపణలకు తగిన సాక్ష్యాలు తమ దగ్గర ఉన్నాయని రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







