టర్కీ కావాలనే రష్యా యుద్ద విమానం కూల్చి వేసింది--పుతిన్
- December 01, 2015
టర్కీ చేయాల్సిందంతా చేసి ఇప్పుడు నాటకాలు ఆడుతున్నదని రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ మండిపడ్డారు. టర్కీ కావాలనే తమ యుద్ద విమానం కూల్చి వేసిందని, వారు చేసిన పనికి తగిన మూల్యం చెల్లించుకుంటారని ఆయన హెచ్చరించారు. ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్)తో సంబంధాలు దెబ్బతింటాయనే ఉద్దేశంతోనే టర్కీ తమ యుద్ద విమానాన్ని టార్గెట్ చేసుకునిందని ఆరోపించారు. ప్యారిస్ లో జరుగుతున్న ప్రపంచ వాతావరణ సదస్సుకు హాజరైన వ్లదిమిర్ పుతిన్ తరువాత మీడియాతో మాట్లాడారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల దగ్గర నుంచి ఆయిల్ దిగుమతి చేసుకునే విషయంలో ఇబ్బందులు ఎదురౌతాయనే ఉద్దేశంతోనే తమ యుద్ద విమానాన్ని టార్గెట్ చేసుకుని కూల్చేశారని, తరువాత ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల దగ్గర సానుభూతి సంపాదించారని ఆయన ఆరోపించారు. టర్కీ భూ భాగంలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు చెందిన ఆయిల్ పైప్ లైన్ ఉందని ఇదే సందర్బంలో గుర్తు చేశారు. ఈ ఆయిల్ పైప్ లైన్ ఇస్లామిక్ స్టేట్ మాత్రమే నిర్వహిస్తుందని వ్లదిమిర్ పుతిన్ చెప్పారు. ఆ పైప్ లైన్ ను తాము ఎక్కడ ద్వంసం చేస్తామో అని భయంతో తమ యుద్ద విమానాన్ని కూల్చి వేశారని ఆరోపించారు. కనీసం హెచ్చరికలు కూడా చెయ్యకుండా ఈ దారుణానికి పాల్పడ్డారని విమర్శించారు. తమ యుద్ద విమానాన్ని టర్కీ కూల్చి వేసిందని తాము అనవసరంగా విమర్శించలేదని, తాము చేస్తున్న ఆరోపణలకు తగిన సాక్ష్యాలు తమ దగ్గర ఉన్నాయని రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం







