ఇండియా:టీవీ ప్యానెల్స్పై దిగుమతి సుంకం తగ్గింపు
- March 24, 2018
దిల్లీ: దేశంలో తయారీ రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వం భారత్కు దిగుమతి అయ్యే టీవీ ప్యానెల్స్పై సుంకాన్ని తగ్గించింది. ఈ మేరకు శనివారం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్(సీబీఈసీ) అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఓపెన్ సెల్(15.6'' అంగుశాలు, అంతకంటే ఎక్కువ) ఎల్ఈడీ, ఎల్సీడీ టెలివిజన్స్లో ఉపయోగించే ప్యానెల్స్పై దిగుమతి సుంకాన్ని 5శాతానికి చేసినట్లు సీబీఈసీ వెల్లడించింది. దిగుమతి సుంకాన్ని తగ్గించడం వల్ల దేశంలో తయారయ్యే ఎల్ఈడీ, ఎల్సీడీ టీవీల విభాగాన్ని ఎంతో ప్రోత్సహించినట్లవుతోందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక నుంచి ఆయా విడిభాగాలపై 5శాతం మేర మాత్రమే సుంకాన్ని వసూలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
గత నెల ఒకటో తేదీన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎల్సీడీ, ఎల్ఈడీ టీవీ ప్యానెల్స్పై విధిస్తున్న దిగుమతి సుంకాన్ని రెట్టింపు చేసిన విషయం తెలిసిందే. గతంలో 7.5శాతంగా ఉన్న కస్టమ్స్ డ్యూటీని ప్రభుత్వం 15శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు ఆ సుంకాన్ని5శాతంకు చేర్చింది.
తాజా వార్తలు
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...







